మీడియా వాచ్ : టీఆర్పీల్లో మళ్లీ టీవీ9 నెంబర్ వన్ !

తెలుగు మీడియా చానల్ టీవీ9 టీఆర్పీల్లో మళ్లీ మొదటి స్థానానికి వచ్చింది. యాజమాన్యం మారిన తర్వాత టీవీ9 వెనుకబడిపోయింది. దాదాపు రెండేళ్లుగా ఆ చానల్ రెండో స్థానంలో ఉంది. మరో తెలుగు మీడియా చానల్ ఎన్టీవీ మొదటి స్థానంలో ఉంటూ వస్తోంది. ఈ వారం వచ్చిన బార్క్ రేటింగుల్లో ఎన్టీవీ కన్నా టీవీ9 ఒక్క పాయింట్ అధికంగా సాధించి మళ్లీ నెంబర్ ప్లేస్‌లో నిలింది.

రెండేళ్ల కిందట కోల్పోయిన తమ నెంబర్ వన్ స్థానం మళ్లీ వచ్చిందన్న ఆనందం టీవీ9 టీమ్‌లో కనిపించింది. కనీసం రెండు గంటల పాటు సంబరాలు చేసుకున్నారు. కేకులు కట్ చేసుకున్నారు. అసలు సాధ్యమయిందో అంరదూ కథలు కథలుగా ప్రేక్షకులకు చెప్పారు. అంతా బాగానే ఉంది ఒకప్పుడు తిరిగులేని పొజిషన్ ఉన్న చానల్ దిగజారిపోయింది కూడా తమ చేతుల్లోనే అని మాత్రం గుర్తు చేసుకోలేకపోయారు.

మొత్తం క్రెడిట్ సహజంగానే రజనీకాంత్ కు కట్టబెట్టారు చాలా మంది. రవి ప్రకాష్ నుంచి ఆయన చేతుల్లోకి చానల్ వెళ్లిన తర్వాత దిగజారిపోయింది.. అల్టిమేట్ స్థానాన్ని కోల్పోయిందని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. టీఆర్పీ రేటింగ్ లు ప్రతీవారం మారిపోతాయి. ఒక్క వారానికే టీవీ9 ఇంత సంబర పడిపోతే వచ్చే వారం రేటింగ్‌లో మళ్లీ టీవీ9 స్థానం పడిపోతే ఎగతాళి చేసే వారికి కొదవ ఉండదు.

ముఖ్యంగా ఎన్టీవీ మళ్లీ ఫస్ట్ వస్తే వాళ్లు ర్యాగింగ్ చేయకుండా ఉంటారా? గతంలో వరుసగా కొన్నాళ్ల పాటు తాము ఫస్ట్ ఉన్నామని ఎన్టీవీ గట్టిగానే ప్రచారం చేసుకుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close