నేడు శకపురుషునికి అద్భుత నీరాజనం !

హైదరాబాద్‌లోని కైతలాపూర్ గ్రౌండ్‌లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించబోతున్నారు. ‘ఎన్టీఆర్‌ లిటరేచర్‌, సావనీర్‌ అండ్‌ వెబ్‌సైట్‌ కమిటీ’ ఆధ్వర్యంలో కైతలాపూర్‌ మైదానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న వేడుకలకు ప్రముఖులంతా తరలి రానున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా వస్తారు. ఎన్టీఆర్ కుటంబసభ్యులతో పాటు ఊహించని సినీ స్టార్లు అందరూ తరలి రాబోతున్నారని చెబతున్నారు. ‘గెస్ట్స్‌ ఆఫ్‌ ఆనర్‌’గా హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ , సీపీఐ జాతీయ కార్యదర్శి డి. రాజా , సీపీఎం జాతీయ సెక్రటరీ శ్రీ సీతారామ్‌ ఏచూరితో పలువురు రాజకీయ నేతలు పాల్గొంటారు.

ఇక పవన్ కల్యాణ్, శివరాజ్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, సిద్దు జొన్నలగడ్డ వంటి వారంతా హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. వీరంతా ఒకే వేదిక కనిపిస్తే అదో సంచలనం అవుతతుంది. రాజకీయాలకు ఏ మాత్రం సంబంధం లేని కార్యక్రమంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సావనీర్‌, వెబ్‌సైట్‌ల ఆవిష్కరణలతోపాట పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. పలువురు ప్రముఖులకు కమిటి పురస్కారాలు అందిస్తుంది. ఎన్టీఆర్‌ సమగ్ర జీవితానికి సంబంధించిన విశేషాలు, సినీ పాటలు, సినిమాలు, ఉపన్యాసాలు తదితర పూర్తి సమాచారంతో రూపొందించిన ‘జై ఎన్టీఆర్‌’ వెబ్‌సైట్‌ అవిష్కరిస్తారు.

టీడీ జనార్ధన్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ వేడుకలకు .. ఆయన స్వయగా అందరి ఇళ్లకు వెళ్లి ఆహ్వానించారు. కీలక నేతలు అందరూ రావడానికి అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అందుకే వారి పేరున హైదరాబాద్‌లో స్వాగతాలు కూడా ఏర్పాటు చేశారని అంటున్నారు. ప్రకటనల్లో పేర్కొన్నట్లుగా హీరోలు అందరూ ముఖ్యంగా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ అందరూ ఒకే వేదికపై కనిపిస్తే.. సినీ ఫ్యాన్స్ కు అంతకంటే కన్నుల పండువ మరొకటి ఉండదు. అందుకే ఈ వేడుకపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

ఏపీ అల్ల‌ర్లు… ఇక అరెస్టులు మొద‌లు!

ఎన్నిక‌ల త‌ర్వాత ఏపీలో జ‌రిగిన అల్ల‌ర్ల‌పై ఏర్ప‌డిన సిట్ ప్రాథ‌మిక నివేదిక‌ను డీజీపీకి అందించింది. రెండు రోజుల పాటు అల్ల‌ర్లు జ‌రిగిన ప్రాంతాల్లో ప‌ర్య‌టించి, అల్ల‌ర్ల వెనుకున్న కార‌ణాలు... అల్ల‌ర్ల వెనుకున్న నేత‌ల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close