మీడియా వాచ్ : ఆ రెండు చానళ్లను కూలీ మీడియా అంటే తప్పేముంది ?

నెంబర్ వన్ మేమే అంటూ.. రెండు చానళ్లు ఒకరుపై ఒకరు కుట్ర ఆరోపణలు చేసుకుంటున్నాయి. కానీ ఆ రెండింటికి ఓ లక్షణం ఉంది. అదేమిటంటే.. కూలీ చేయడం. ఒకే పార్టీకి కూలీ చేయడం దగ్గర ఆ చానళ్లకు భావసారూప్యం ఉంది. ఆ విషయం శుక్రవారం మరోసారి నిరూపితమైంది.

నెంబర్ వన్, టు చానళ్లకు హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ కనిపించలేదు. అది పబ్లిక్ డాక్యుమెంట్.అందరికీ అందుబాటులోకి వచ్చింది. అందులో సంచలనాత్మక విషయాలు ఉన్నాయి. అందరూ ఇచ్చారు. కానీ ఈ రెండు చానళ్లకు మాత్రం.. తమ అనధికారిక సూపర్ ఎడిటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి మాత్రం గ్రీన్ సిగ్నల్ రాలేదు. అందుకే వేయలేదు. కానీ ఇదే రెండు చానళ్లు.. రెండు వారాల కిందట కరకట్టపై చంద్రబాబు నివాసం జప్తు అంటూ చేసిన హడావుడి మాత్రం ఇప్పటికీ ఉంది.

అసలు లేని స్కాంలో ఆస్తులు ఎలా జప్తు చేస్తారో ..అసలు క్విడ్ ప్రో కో పేరుతో ప్రైవేటు ఆస్తుల్ని జప్తు చేసే అధికారం సీఐడీకి ఉందా లేదా అనే ఆలోచన చేయకుండా .. అసలు సీఐడీకి ప్రభుత్వం ఇచ్చిన అనుమతుల్లో ఏముందో చెప్పకుండా తప్పుడు ప్రచారం చేసేశారు. అక్కడ స్కాం జరిగిదని..చంద్రబాబు దొరికిపోయారన్నట్లుగా రాశారు. ప్రచారం చేశారు. కానీ ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు. వారు చేసిన ప్రచారం నిజం అయితే..సీఐడీ కోర్టుకు ఎందుకు వెళ్లలేదు. తాము ప్రచారం చేశాం కాబట్టి ఈ విషయంలో సీఐడీని ఈ మీడియా ఎందుకు ప్రశ్నించదు.

మీడియా అంటే ప్రజల తరపున విపక్షంగా ఉండాలి.కానీ ఇక్కడ విపక్షాలపై తప్పుడు ప్రచారం చేస్తూ.. అధికార పార్టీ నేతలు అత్యంత దారుణమైన హత్యలు చేసినా నిస్సిగ్గుగా సపోర్టు చేస్తూ.. “విలువ” లెక్క కట్టుకుంటున్నారు. వీరిని నీలి మందకు కూలి మీడియా అంటే తప్పేముంది ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close