కడప వాసుల్లో సునీత పోరాటానికి పెరుగుతున్న మద్దతు !

రాజకీయాల్లో భయ పెట్టి అందర్నీ తమ వెనుక నడిపించుకోవడం కన్నా…సానుభూతి అనేది ఎక్కువ బలమైనది. ప్రజల సానుభూతి పొందితే వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కడప జిల్లాలో వైఎస్ కుటుంబం ఈ రెండు అస్త్రాలను చాలా కాలంగా ప్రయోగిస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఆ కుటుంబంలో వచ్చిన చీలకి కారణంగా భయ పెట్టే అస్త్రం వైఎస్ జగన్ వైపు.. సానుభూతి అస్త్రం వైఎస్ సునీత వైపు వెళ్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం సనీత పోరాటంపై కడప జిల్లా వాసుల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

కడప జిల్లాలో వైఎస్ ఫ్యామిలీపై అభిమానం కంటే భయమే ఎక్కువ. రౌడీ మూకను పెంచి పోషించి ఎవరైనా ఎదురు తిరిగితే ఇళ్ల మీదకు పంపుతారన్న ఉద్దేశంతో .. చాలా మంది సపోర్టుగా ఉంటూంటారు. అదే సమయంలో వైఎస్ ఫ్యామిలీ అంతా ఏకతాటిపై ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కుటుంబం చీలికలు పేలికలు అవుతోంది. ఇలాంటి సమయంలో జరిగిన వివేకానందరెడ్డి హత్య సంచలనం అవుతోంది. ఆ హత్యను కుటుంబంలోని వారే చేసినట్లుగా స్పష్టం కావడం.. వారికి శిక్ష పడేలా సునీత నిరంతరం పోరాటం చేస్తూండటం .. ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది.

అందరి మీద సునీత పోరాడుతున్న వైనం.. ఆమె ధైర్య సాసహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు. వైఎస్ కుటుంబానికి అసరైన వారసురాలు సునీతేనన్న అభిప్రాయం రచ్చబండల వద్ద జరుగుతున్న చర్చల్లో వస్తోంది. అయితే సునీత ఇంత వరకూ రాజకీయాల గురించి మాట్లాడలేదు. రాజకీయాలపై ఆసక్తి ఉన్నట్లుగా కూడా చెప్పలేదు. కానీ తన తండ్రిని అత్యంత కిరాతకంగా హత్య చేయడం.. ఆ హత్యను తన మీద వేయడానికి కూడా చేసిన ప్రయత్నాలతో ఇక కుటుంబసభ్యులు అని ఉపేక్షించడం దండగని ఆమె అనుకుంటున్నారు. అందుకే ఎంతైనా తెగించి పోరాడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆమె రాజకీయ పోరాటం చేస్తే.. ఎవరూ ఊహించని ఫలితాలు వస్తాయన్న ప్రచారం మాత్రం ఊపందుకుంటోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎన్నికల్లో ప్రజలకు పరీక్ష పెడుతోన్న జగన్ రెడ్డి..!?

ఈ ఎన్నికల్లో ఏపీ ప్రజలను జగన్ రెడ్డి పరిక్షీస్తున్నట్టు ఉంది. సొంత చెల్లి మీడియా ముంగిటకు వచ్చి జగన్ నిజస్వరూపం బయటపెడుతున్నా నిజాన్ని నిందగా చిత్రీకరించుకుంటూ జనం మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తుండటం...

జగన్ మానసిక స్థితిపై డౌట్ గా ఉంది : షర్మిల

జగన్ మానసిక పరిస్థితిపై తేడాగా ఉందని బ్యాలెన్స్ తప్పిందేమోనని డౌట్ గా ఉందని ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. కడపలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జగన్ కు ఓ...

ఖమ్మంలో నామా వైపు టీడీపీ సానుభూతిపరులు !

పరిస్థితి క్లిష్టంగానే ఉన్నా ఖమ్మంలో నామా నాగేశ్వరరావు ధైర్యంగా పోరాడుతున్నారు. బీజేపీ తరపున సరైన అభ్యర్థి లేకపోవడం ఎవరికీ తెలియని వినోద్ రావు అనే వ్యక్తిని బీజేపీ నిలబెట్టింది. బీజేపీకి ఉన్న...

రోహిత్ శ‌ర్మ ఫీల్డ్ లో ఉండ‌డం కూడా ఇష్టం లేదా పాండ్యా…?!

ఈ ఐపీఎల్ లో ముంబై ఆట ముగిసింది. ప్లే ఆఫ్ రేసు నుంచి ఈ జ‌ట్టు దూర‌మైంది. ఐదుసార్లు ఐపీఎల్ విజేత‌గా నిలిచిన ముంబై ఈసారి క‌నీసం ప్లే ఆఫ్‌కు కూడా అర్హ‌త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close