కవిత విషయంలో సీబీఐ ఒకలా ఈడీ మరోలా !

సీఎం కేసీఆర్ కుమార్తె కవిత విషయంలో సీబీఐ చాలా ఉదారంగా ఉంటోంది. ఆమెను ప్రశ్నించిన వారి జాబితాలోనూ చూపించడం లేదు. కానీ ఈడీ మాత్రం.. ఎక్కడ అవకాశం వచ్చినా కవిత పాత్రపై బలంగా ఆధారాలతో సహా కోర్టుల్లో కౌంటర్లు వేస్తోంది. వారం కిందట సీబీఐ దాఖలు చేసిన ఓ కౌంటర్ లో కవిత ప్రస్తావనే రాకపోగా.. తాజాగా పిళ్లై బెయిల్ పిటిషన్ ను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్ లో మాత్రం మొత్తం కవితే చేశారన్నట్లుగా కౌంటర్ వేశారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌కు సంబంధించి ఇండోస్పిరిట్ వాటాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే అసలైన పెట్టుబడిదారు అని అరుణ్ పిళ్లై అంగీకరించినట్లు ఈడీ వెల్లడించింది. లిక్కర్ పాలసీలో కవిత, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మధ్య ఒప్పందం, అవగాహన ఉందని పిళ్లై, బుచ్చి బాబు స్టేట్‌‌మెంట్లు ఇచ్చినట్లు తెలిపింది. సౌత్ గ్రూప్‌‌లో ఆమె పాత్ర, నిందితులు అరుణ్ రామ చంద్ర పిళ్లై, బుచ్చిబాబు, సమీర్ మహేంద్రు, మాగుంట రాఘవ, శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, దినేశ్‌‌ అరోరాతో ఉన్న సంబంధాలను వారి స్టేట్‌‌మెంట్ల రూపంలో మెన్షన్ చేసింది. ముఖ్యంగా ఇండో స్పిరిట్ (ఎల్1) కంపెనీలో కవిత ఇన్వెస్ట్ మెంట్‌‌పై పిళ్లై ఇచ్చిన వాంగ్మూలాన్ని వివరించింది.

ఇండో స్పిరిట్ (ఎల్1)లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బినామీగా వ్యవహరించినట్లు అరుణ్ రామ చంద్ర పిళ్లై అంగీకరించారని ఈడీ పేర్కొంది. లిక్కర్ వ్యాపారంపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, అప్పటి డిప్యూటీ సీఎం సిసోడియా, బీఆర్ఎస్ కవితల మధ్య అవగాహన ఉందని కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు ఇచ్చిన స్టేట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ను ఈడీ ప్రస్తావించింది. అంటే ఈ ముగ్గురూ కలిసే చేశారని చెబుతోంది. ఈ లెక్కన చూస్తే.. కేజ్రీవాల్ కూడా ఇబ్బందుల్లో పడటం ఖాయంగా కనిపిస్తోంది.

మరో వైపు శరత్ చంద్రారెడ్డిని అప్రూవర్ గా మార్చడంలో జగన్ సక్సెస్ అయ్యారన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే.. కవితతో పాటు కేజ్రీవాల్ కూడా తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారు. అందుకే ఈ కేసు కీలక మలుపులు తిరగనుందన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close