నెల్లూరు పెద్దారెడ్డు డిసైడయ్యారు !

వైసీపీని ధిక్కరించిన ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మరో మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని వీరు ముగ్గురూ ప్రకటించారు. వారి అనుచరులంతా.. లోకేష్ పాదయాత్రలో పాల్గొననున్నారు. శుక్రవారమే ఆనం రామనారాయణరెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు ఆనం. లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లపై పలువురు నేతలు ఆనంను కలిశారు.

ఆనం రామనారాయణ రెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిశారు టీడీపీ నేతలు. టీడీపీలోకి రమ్మంటూ లాంఛనంగా ఆహ్వానం పలికారు ఇప్పటికే కోటంరెడ్డి స్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. మరో వైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వైసీపీలో తనకు టిక్కెట్ ఇచ్చేది లేదన్నారని.. ఎమ్మెల్సీ ఇస్తామన్నారని.. కానీ తానుటీడీపీలో చేరుతున్నాన్నారు. టీడీపీలో టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తాననిప ప్రకటించారు.

ముగ్గురు ఎమ్మెల్యేలు నెల్లూరు నుంచి టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో టీడీపీలో ఒక్క సారిగా ఊపు వచ్చినట్లయింది. నిజానికి వైసీపీలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. మరో ఇద్దరు , ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీలోకి వస్తామని కబురు పంపారు. కానీ చంద్రబాబు అంగీకరించలేదని చెబుతున్నారు. నెల్లూరులో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఒక్కో జిల్లాలో ఎంట్రీ సమయంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని .. టీడీపీ నేతలు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

ఆ ఇద్దరు మంత్రులతో రేవంత్ కు గ్యాప్ పెరుగుతుందా..?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా నిర్వహించిన సమీక్ష సమావేశం తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. సంబంధిత మంత్రులు లేకుండా రేవంత్ సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేయడం విమర్శలకు తావిస్తోంది. బుధవారం సచివాలయంలో వ్యవసాయ...

బీఆర్ఎస్ దీన స్థితికి ఇది మరో సాక్ష్యం !

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కసరత్తు కోసం బీఆర్ఎస్ చేపట్టిన సమావేశానికి పట్టు మని నలభై మంది నేతలు రాకపోవడం ఆ పార్టీ దుస్థితిని తెలియచేస్తోంది. బీజేపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close