నాడు పోలవరానికి బస్సులు – నేడు వెళ్తే అరెస్టులు !

ఎవరైనా మంచి పని చేస్తే చూపించుకోవాలని తాపత్రయ పడతారు. రాజకీయాల్లో అయితే.. ఏ కొంచెం మంచి చేసినా ఇంకా ఎక్కువ చూపించుకుంటారు. ఏమీ చేయకపోతేనే దాచుకునేందుకు ప్రయత్నిస్తారు. పోలవరం విషయంలో గత ప్రభుత్వం రాష్ట్రం మొత్తం బస్సులేసి ప్రజలకు పోలవరం ప్రాజెక్టును చూపించేది. ఎవరు అక్కడికి వెళ్లి చూడాలన్న ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. పైగా అక్కడ గైడ్ లాంటి వారిని పెట్టి మొత్తం ప్రాజెక్టు గురించి వివరించి చెప్పేవారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక మొత్తం రివర్స్ లో జరుగుతోంది. ప్రాజెక్టు వద్ద ఏం జరుగుతుందో ఎవరికీ తెలియనివ్వడం లేదు. ఎవర్నీ చూడనివ్వడం లేదు. ఎవరైనా వెళ్తారనితెలిస్తే పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించిముందస్తు అరెస్టులు చేయిస్తున్నారు. పోలవరం చూస్తే ప్రభుత్వనికి వచ్చిన నొప్పేమిటని జనానికి వస్తున్న డౌట్. పోలవరం ప్రాజెక్ట్ లాంటి అతి క్లిష్టమైన కట్టడాన్ని కొత్త ప్రాజెక్ట్ సంస్థ మేఘా నాశనం చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది. శాశ్వతంగా నిలిచి ఉండాల్సిన గైడ్ బండ్ కుంగిపోవడం .. అందర్నీ విస్మయ పరుస్తోంది. ప్రాజెక్టు దగ్గరకు ఎవరైనా వెళ్తే లోపాలు తెలిసిపోతాయన్న ఉద్దేశంతో అందర్నీ ఆపుతున్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది.

తాము ఏం చేస్తున్నామో చూపించడానికి గతంలో బస్సులు వేస్తే.. వైసీపీ నేతలు విమర్శించేవారు. అది పబ్లిసిటి స్టంట్ అనేవారు. ఇప్పుడు అసలు ఎవర్నీ చూడకుండా ఎందుకు దాస్తున్నారో.. .విపక్ష నేతలు వెళ్తే ఎమవుతుందో కానీ.. మొత్తానికి ప్రభత్వానికి తేడాగా వ్యవహరిస్తోంది. పోలవరం సందర్శనకు నిపుణులను అనుమతిస్తే.. అసలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.అందుకే ప్రభుత్వం వందల మందిని పెట్టి అడ్డుకుంటోందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close