నెల్లూరు పెద్దారెడ్డు డిసైడయ్యారు !

వైసీపీని ధిక్కరించిన ముగ్గురు ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. మరో మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాలోకి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని వీరు ముగ్గురూ ప్రకటించారు. వారి అనుచరులంతా.. లోకేష్ పాదయాత్రలో పాల్గొననున్నారు. శుక్రవారమే ఆనం రామనారాయణరెడ్డి హైదరాబాద్‌లో చంద్రబాబుతో సమావేశం అయ్యారు. ఈ విషయాన్ని ఆయనే ప్రకటించారు. మూడు రోజుల్లో నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనున్న యువగళం పాదయాత్రను విజయవంతం చేసేందుకు కృషి చేస్తామన్నారు ఆనం. లోకేష్ పాదయాత్ర ఏర్పాట్లపై పలువురు నేతలు ఆనంను కలిశారు.

ఆనం రామనారాయణ రెడ్డితోపాటు మరో ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్‌రెడ్డిని కలిశారు టీడీపీ నేతలు. టీడీపీలోకి రమ్మంటూ లాంఛనంగా ఆహ్వానం పలికారు ఇప్పటికే కోటంరెడ్డి స్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. మరో వైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. బద్వేలు నియోజకవర్గం అట్లూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మేకపాటి సంఘీభావం తెలిపారు. తాను పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. వైసీపీలో తనకు టిక్కెట్ ఇచ్చేది లేదన్నారని.. ఎమ్మెల్సీ ఇస్తామన్నారని.. కానీ తానుటీడీపీలో చేరుతున్నాన్నారు. టీడీపీలో టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ కోసం పని చేస్తాననిప ప్రకటించారు.

ముగ్గురు ఎమ్మెల్యేలు నెల్లూరు నుంచి టీడీపీలో చేరాలని నిర్ణయించుకోవడంతో టీడీపీలో ఒక్క సారిగా ఊపు వచ్చినట్లయింది. నిజానికి వైసీపీలో పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. మరో ఇద్దరు , ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇస్తే టీడీపీలోకి వస్తామని కబురు పంపారు. కానీ చంద్రబాబు అంగీకరించలేదని చెబుతున్నారు. నెల్లూరులో లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన తర్వాత ఒక్కో జిల్లాలో ఎంట్రీ సమయంలో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని .. టీడీపీ నేతలు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close