ఎక్స్‌క్లూజీవ్‌: సుకుమార్ రైటింగ్స్ లో ప్ర‌భాస్‌

సుకుమార్ సినిమాలే కాదు..సుకుమార్ క‌థ‌లు, ఆయ‌న బ్యాన‌ర్ కూడా ఓ బ్రాండ్ అయిపోయింది. సుకుమార్ రైటింగ్స్‌లో వ‌చ్చిన సినిమాలు సూప‌ర్ హిట్లు అవుతున్నాయి. సుకుమార్ శిష్యులు క్రేజీ ద‌ర్శ‌కుల జాబితాలో చేరిపోతున్నారు. అందుకే సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌కి అంత డిమాండ్ ఏర్ప‌డింది. ఇప్ప‌టి వ‌ర‌కూ సుకుమార్ రైటింగ్స్ లో కొత్త హీరోలు, యంగ్ హీరోలే సినిమాలు చేశారు. ఇప్పుడు బ‌డా స్టార్ల‌తో కూడా ఆయ‌న సినిమాలు చేయ‌బోతున్నారు. అందులో భాగంగా సుకుమార్ రైటింగ్స్ లో ప్రభాస్ క‌థానాయ‌కుడిగా ఓ సినిమా రూపొందే అవ‌కాశాలు పుష్క‌లంగా క‌నిపిస్తున్నాయి.

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా ఓ సినిమా రావాల్సింది. సాంకేతిక కార‌ణాల వ‌ల్ల ఈ ప్రాజెక్ట్ ఆల‌స్యం అవుతోంది. అయితే.. సుకుమార్ క‌థ‌, స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు అందిస్తూ నిర్మించే చిత్రంలో ప్ర‌భాస్ హీరోగా న‌టించ‌బోతున్నాడ‌ని ఇన్ సైడ్ వ‌ర్గాల టాక్‌. సుకుమార్ శిష్యుడు ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. ప్ర‌స్తుతానికి ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప‌నులు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడు ఎవ‌రు? ఎప్పుడు ఈ సినిమాని ప‌ట్టాలెక్కిస్తారు? అనే విష‌యాలు వెల్ల‌డ‌వుతాయి. ‘విరూపాక్ష‌’లా ఇది కూడా ఓ అడ్వెంచ‌రెస్ థ్రిల్ల‌ర్ అని తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

రేవంత్ సర్కార్ కు టైం ఫిక్స్ చేసిన బీజేపీ..!?

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ను కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా..? ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ అయిందా..? కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రేవంత్ సీఎం పీఠం మున్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోనుందా..?అంటే వరుసగా...

వైసీపీ సోషల్ మీడియా సైలెన్స్ – ఐ ప్యాక్‌ను వదిలించుకున్నారా ?

వైసీపీ సోషల్ మీడియా ఒక్క సారిగా మూగబోయింది. మామూుగా అయితే ఈ పాటికి ఫేక్ ఎగ్జిట్ పోల్స్ తో హడలెత్తించాలి. కానీ పోలింగ్ రోజు మధ్యాహ్నానికి చేసిన ఫేక్ సర్వే వీడియోల...

వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్న వైసీపీ నేతలు

వైసీపీ నేతలు వరుసగా సాకులు చెబుతూ తెరపైకి వస్తున్నారు. నిరాశ నిండిన మొహాలతో ఈసీపై పోలీసులపై ఆరోపణలు చేస్తున్నారు. పల్నాడులో తమ ప్లాన్ పారకపోవడంతో నేతలు నిరాశకు గురయ్యారు. ఈ రోజు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close