ఢిల్లీకీ ఏపీ సీఈవో – ఓటర్ల జాబితానా ? ముందస్తు ఎన్నికలా ?

ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాను .. సీఈసీ ఢిల్లీకి పిలిపించింది. ఆయన ఎన్నికలసంఘం ఉన్నతాధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. ఇటీవలి కాలంలో ఏపీలో ఓట్ల గల్లంతు.. దొంగ ఓట్ల చేరికపై తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి. ఆధారాలతో సహా ఇలాంటి వాటిని తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇవి ఊహించనంతగా ఉండటంతో.. ఆయనను వివరణ కోసం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పిలిపించారన్న ప్రచారం ఏపీలో జరుగుతోంది.

కానీ అలాంటి ప్రచారం వ్యూహాత్మకంగా చేస్తున్నారని.. ఏపీలో ఎన్నికల నిర్వహణ సన్నద్దతపై పూర్తి వివరాలతో ఎస్ఈవో ఢిల్లీకి వెళ్లారని అంటున్నారు. ఐదు రాష్ట్రాలతో పాటు ఆరో రాష్ట్రంగా ఏపీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో జగన్ రెడ్డి కేంద్ర పెద్దలతో మాట్లాడారని..ఈసీని కూడా సంప్రదించారని చెబుతున్నారు. అందుకే ఈసీ కూడా సన్నాహాలు చేస్తోందన్న అభిప్రాయం వినిపిస్తోంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు అక్టోబర్ లో షెడ్యూల్ రావాల్సి ఉంది. డిసెంబర్ మొదటి వారంలో పోలింగ్ జరుగుతుంది. ఇందు కోసం ఈసీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలు పూర్తి చేసింది. ఏపీలోనూ అంతర్గతంగా పనులు చేస్తోందని అంటున్నారు. బుధవారం సీఎం జగన్ కేబినెట్ సమావేశం నిర్వహించబోతున్నారు. ఆ సమావేశంలో జగన్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close