అక్కడ సౌండ్ చేస్తే ఇక్కడ రీసౌండ్ వస్తోందేమిటబ్బా?

ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో రాజకీయాలు భలేగా సాగుతున్నాయి. ఒక రాష్ట్రంలో మ్రోగే రాజకీయ శబ్దాలు మరొక రాష్ట్రంలో ప్రతిధ్వనిస్తున్నాయి. ఆంధ్రాలో తెదేపా ప్రభుత్వం కూడా తెరాస ప్రభుత్వాన్ని ఆదర్శంగా తీసుకొని ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలని ఫిరాయింపులకి ప్రోత్సహిస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కనుక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఏమి మాట్లాడినా అది పొరుగు రాష్ట్రంలో ప్రతిధ్వనిస్తోంది. ఏమి చేసినా అది పొరుగు రాష్ట్రంలో చర్చింపబడుతోంది. రాష్ట్రం విడిపోయాక రాజకీయాలు కూడా విడిపోతాయనుకొంటే అవి ఇంకా దగ్గరవుతున్నట్లుగా కనిపిస్తున్నాయి.

ఉదారణకి తెలంగాణా తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఈరోజు గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో భాగంగా హన్మకొండలో ప్రచారం చేస్తూ తెరాసపై చేసిన విమర్శలన్నీ ఆంధ్రప్రదేశ్ లో తమ తెదేపాకు అక్షరాల వర్తింపజేసుకోవచ్చును. ఆయన ఏమన్నారంటే “తెరాస అంతా ఇప్పుడు తెలంగాణా ద్రోహులు, కబ్జాదారులతో నిండిపోయింది. ఆ పార్టీలో ప్రజలకు సేవ చేయాలనుకొనే నాయకులే కరువయ్యారు. జీవిత కాలం ప్రత్యర్దులయిన కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కొండా మురళి ఇప్పుడు ఒకే పార్టీలో చేరి ఎలాగ పనిచేస్తారు?” అని ప్రశ్నించారు.

ఇప్పుడు ఆయన మాటలనే ఏపిలో తెదేపాకు వర్తింపజేసి చూసుకొన్నట్లయితే, దొంగల పార్టీగా అభివర్ణించిన వైకాపా నుండే ఇప్పుడు తెదేపా ఎమ్మెల్యేలను తెచ్చుకొంటోంది. అందుకు ఒక్కొక్కరికీ రూ.20కోట్లు కూడా చెల్లిస్తోందని వైకాపా నేత అంబటి రాంబాబు చెప్పారు. ఇక రాష్ట్రంలో ఇసుక మాఫియా, రాజధాని భూముల బినామీ కొనుగోళ్ళపై వైకాపా చేస్తున్న ఆరోపణలు నిజమనుకొన్నట్లయితే తెదేపాలో కూడా ప్రజలకు సేవ చేసేవాళ్ళే కరువయ్యారని చెప్పుకోవలసి ఉంటుంది.

ఇక ఒకే నియోజక వర్గానికి చెందిన జీవితకాల శతృవులు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి ఇప్పుడు తెదేపాలో ఉన్నారు. ఆలాగే ఆనం సోదరులు, జేసి బ్రదర్స్, గంటా శ్రీనివాసరావు తదితరులు వారి బద్ధ శత్రువులు అందరూ కూడా తెదేపాలో ఉన్నారు. అక్కడ రేవంత్ రెడ్డి అడిగిన ప్రశ్నలనే ఏపిలో వైకాపా అడగవచ్చును. ఏపిలో వైకాపా నేతలు తెదేపాపై చేస్తున్న ఆరోపణలనే తెలంగాణాలో తెదేపా, కాంగ్రెస్ నేతలు తెరాస ప్రభుత్వాన్ని అడగవచ్చును.

ఈవిధంగా రెండు రాష్ట్రాలలో రాజకీయాలు విడదీయలేనంతగా పెనవేసుకుపోతున్నాయి. రాష్ట్రాలుగా విడిపోయినా అన్నదమ్ములలాగ కలిసుందామని ఇదివరకు తెరాస నేతలు చెప్పేవారు. కానీ దానినే కొంచెం మార్చి చెప్పుకొంటే రాష్ట్రాలుగా విడిపోయినా రాజకీయంగా కలిసుందామని చెప్పుకోవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా బాయ్ కి కోపమొచ్చింది… ఛోటా బాయి కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close