ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం

ఆలూ లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లున్నాయి అమరావతి గురించి వినిపిస్తున్న కధలు. ఈ మిగిలిన మూడేళ్ళలో అమరావతి నిర్మాణం మొదలుపెడతారో లేదో కూడా తెలియని పరిస్థితులు కనిపిస్తుంటే, అమరావతి నిర్మాణంలో పాలు పంచుకొనే జపాన్ సంస్థలలో ఉద్యోగాలు పొందడం కోసం యువతకు జపనీస్ బాషలో శిక్షణ ఇవ్వడం గురించి వార్తలు వింటుంటే నవ్వు వస్తుంది.

అమరావతిలోనే రాష్ట్ర హైకోర్టు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకొంటామని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ అనకాపల్లి ఎంపి అవంతి శ్రీనివాస్ కి హామీ ఇవ్వడం కూడా అలాగే ఉంది. ఆయన ఇస్తున్న ఈ హామీ రాజధాని మొదటి దశ నిర్మాణం పూర్తయినప్పుడు అమలు చేయడానికి వీలవుతుంది తప్ప ఇప్పటికిప్పుడు అమరావతిలో హైకోర్టు నిర్మాణం చేయడం సాధ్యం కాదని అందరికీ తెలుసు.

విభజన సమయంలో రాజధాని నిర్మాణానికి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని కేంద్రం రాష్ట్రానికి హామీ ఇచ్చినప్పటికీ, మోడీ ప్రభుత్వం దానికి కూడా కొంచెం కత్తెర వేసి రాజధాని నిర్మాణానికి కేవలం రూ.25,000 కోట్లు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పింది. కనుక అమరావతి నిర్మాణం కోసం సింగపూర్ చుట్టూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రదక్షిణాలు చేయక తప్పడం లేదు. సింగపూర్ సంస్థలు స్విస్ చాలెంజ్ పద్దతిలో రాజధాని నిర్మాణానికి సిద్దంగా ఉన్నప్పటికీ వాటి గొంతెమ్మ కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వం తీర్చలేకపోతోంది.

కనుక రాజధాని నిర్మాణం ఇంకా ఎప్పుడు మొదలవుతుందో ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితిలో అమరావతిలో హైకోర్టు ఏర్పాటు, జపనీస్ బాష నేర్చుకోవడం వంటి మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజలందరూ సింగపూర్ సంస్థలు గీసిచ్చిన అందమయిన అమరావతి ఫోటోలను చూసుకొంటూ, తాత్కాలిక సచివాలయం గురించి కబుర్లు వింటూ కాలక్షేపం చేసుకోక తప్పదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close