పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు – డిసెంబర్ ఎన్నికలకు రెడీనా ?

డిసెంబర్ లో లోక్ సభకూ ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ.. విస్తృతంగా జరుగుతున్న ప్రచారానికి బలం ఇచ్చేలా వరుసగా ఒక దాని తర్వాత ఒకటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 18 నుంచి 22 వరకూ పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని కేంద్రం తాజాగా ప్రకటించింది. ఇటీవలే వర్షాకాల సమావేశాలు ముగిశాయి. విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెడితే .. చర్చ కూడా జరిగింది. ఇప్పుడు మళ్లీ హఠాత్తుగా పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడం చర్చనీయాంశమవుతోంది.

డిసెంబర్ లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. మళ్లీ ఏప్రిల్ లో ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిషా రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇలా వరుసగా ఎన్నికలు జరుగుతూండటంతో ప్రజాధనం వృధా అవుతోందని.. మొత్తం తొమ్మిది రాష్ట్రాలతో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా ఒకే సారి నిర్వహించాలన్న ఆలోచనకు కేంద్రం వస్తోందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేయడానికే పార్లమెంట్ సెషన్ నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. ఎన్నికల సంఘం ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు కూడా ఏర్పాట్లు పూర్తి చేసింది. పలు రాష్ట్రాల్లో తుది ఓటర్ల జాబితాను ఫైనల్ చేయడానికి ప్రయత్నిస్తోంది.

ఏపీ, ఒడిషాల్లో కూడా రిటర్నింగ్ ఆఫీసర్లను కూడా నియమించారు. మొత్తంగా కేంద్రం… నిర్ణయం తీసుకుంటే అధికారింగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. డిసెంబర్ లేదా జనవరి మొదటి వారంలో పోలింగ్ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close