వారాహి యాత్రకు టీడీపీ క్యాడర్ కూడా !

జనసేనాని వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదురోజుల పాటు సాగనుంది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న యాత్ర కు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నామని జనసేన పార్టీ అధినేత స్పష్టంగా ప్రకటించిన తర్వాత పవన్ కల్యాణ్ తొలి సారి ప్రజల్లోకి వస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ క్యాడర్ కూడా పవన్ యాత్రలో పాల్గొనాలని నిర్ణయించుకుంది.

చంద్రబాబు అరెస్ట్ కారణంగా పార్టీ వ్యవహారాలను నడిపించడానికి పొలిటికల్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్ చేసిన ప్రాంతంలో సమావేశం అయింది. నందమూరి బాలకృష్ణ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ముగిసిన తర్వాత బాలకృష్ణ వారాహియాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. జనసేన, టీడీపీ కలిసి పోరాటాలు చేసేందుకు, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సమన్వయం చేసుకునేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

టీడీపీ, జనసేన పొత్తు రాజకీయ ముఖ చిత్రం మార్చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పార్టీ క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో కలిసిపోయే వాతావరణాన్ని రెండు పార్టీలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. సోషల్ మీడియాలో సొంత ఎజెండాలతో వ్యవహరిస్తున్న కొంత మందిని పూర్తిగా పక్కన పెట్టాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. వారితో తమ పార్టీలకు ఎలాంటి సంబంధం లేదని పట్టించుకోకుండా ఉండే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

థియేట‌ర్ Vs ఓటీటీ… తీర్పు మారుతోందా?

సినిమా వెండితెరపై ఆస్వాదించే వినోదం. ఒక సమూహంతో కలసి థియేటర్ లో సినిమా చూడటంలో కిక్కే వేరు. అయితే ఇప్పుడు థియేటర్ కి సమాంతరంగా ఓటీటీ కూడా ఎదుగుతోంది. సినిమా వ్యాపారంలో కీలక...

ఇదేందయా ఇది- కిషన్ రెడ్డిపై కంప్లైంట్..!

కేంద్రమంత్రి, సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి ఫిర్యాదు అందింది. ఓటు వేసిన అనంతరం ఎన్నికల ప్రవర్తన నియామళికి విరుద్దంగా ఆయన వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్...

అధికారం నెత్తికెక్కితే పాతాళంలోకే !

అధికారం ప్రజలు ఇచ్చేది. అలాంటి ప్రజల కన్నా తానే ఎక్కువ అనుకుంటే.. పాతాళంలోకి పంపేస్తారు ప్రజలు. చరిత్రలో జరిగింది ఇదే. ఇప్పుడు జరుగుతోంది ఇదే. భవిష్యత్ లో జరగబోయేది కూడా ఇదే. ఎందుకంటే...

తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతోన్న పోలింగ్ … ఓటేసిన ప్రముఖులు

ఎంపీ ఎనికల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకొని క్యూ లైన్ లో నిల్చొని ఓటు వేశారు. ప్రజలంతా తమ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close