గచ్చిబౌలిలో ప్రతిధ్వనించిన చంద్రబాబుపై అభిమానం !

బతుకులు మార్చిన వారిని మర్చిపోని మనుషులు ఉండటం వల్లనే సమాజంలో ఇంకా విలువలు ఉన్నాయి. ఈ విషయాన్ని మరోసారి గచ్చిబౌలి స్టేడియం నిరూపించింది. చంద్రబాబునాయుడు ఐటీ అభివృద్ధికి చేసిన కృషికి గుర్తింపుగా.. ఆయనను అక్రమ కేసుల్లో జైల్లో పెట్టిన సందర్భంలో సంఘిభావంగా.. ఐటీ ప్రొఫెషనల్స్ ఫోరం ఏర్పాటు చేసిన సీబీఎన్ గ్రాటిట్యూడ్ ప్రొగ్రామ్‌కు స్వచ్చందంగా జనాలు తరలి వచ్చారు. స్టేడియం మొత్తం క్కికిరిసిపోయింది. చంద్రబాబుకు మద్దతుగా ప్రతి ఒక్కరు తమ సంఘిభావాన్ని తెలిపారు.

అది రాజకీయ సభ కాదు. అంతకు మించి తెలంగాణలో టీడీపీ పోటీ చేయడం లేదని ప్రకటించారు. అక్కడికి వచ్చిన వారందరూ చంద్రబాబుకు సంఘిభావం తెలియచేయాలన్న ఉద్దేశంతోనే వచ్చారు. ఐటీ రంగం ద్వారా ఉపాధి పొందిన వారందరూ… తమ మెంటార్‌కు అండగా నిలబడేందుకు ఉత్సహం చూపించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడికి సంఘిభావంగా ఇలాంటిప్రదర్శనలు జరిగి ఉండవు. ఆ ఘనత…. ఆ గొప్పతనం… చంద్రబాబుకే సొంతం.

చంద్రబాబు మాస్ లీడర్. రియల్ మాస్ లీడర్. ప్రపంచ గతిని… ఆర్థిక వ్యవస్థును ముందుకు తీసుకెళ్లే ప్రభావవంతమైన వ్యక్తుల్లో అసాధారణ ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్. పేద కుటుంబాల్ని ఐటీ రంగం ద్వారా ఉన్నత స్థానికితీసుకెళ్లిన మాస్ లీడర్. అందుకే ఆయనకు అన్ని వర్గాల్లో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఒక్క రూపాయి అవినీతి చూపించకుండా. వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఆయనను జైలులో పెట్టవచ్చు కానీ… ప్రజల గుండెల్లో ఉండే అభిమానాన్ని మార్చం చెరపలేరని మరోసారి నిరూపితమైంది.

చంద్రబాబుపై ప్రజల్లో ఉన్న అభిమానాన్ని ఇప్పటి వరకూ ప్రదర్శించే అవకాశం లేని వారందరికీ… ఆయనను జైల్లో పెట్టడం ద్వారా…. తమ అభిమానాన్ని.. సంఘిభావాన్ని చూపించే అవకాశాన్ని కల్పించారని అనుకోవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close