మహారాష్ట్రలో మంటలు – లోక్‌సభతో పాటే ఎన్నికలు ?

మహారాష్ట్రలో రాజకీయ మంటలు ఓ రేంజ్‌లో వస్తున్నాయి. మరాఠా కోటా పేరుతో అక్కడ రిజర్వేషన్ల ఉద్యమం ప్రారంభమైంది. చివరికి తెలంగాణ ఉద్యమం తరహాలో ప్రజాప్రతినిధుల ఇళ్లపై దాడులు చేయడం ప్రారంభమయింది. మరాఠా ఉద్యమ నాయకుడు ఆమరణదీక్ష కూడా ప్రారంభించారు. మరో వైపు ఒత్తిడి తట్టుకోలేక కొంత మంది ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేస్తామని చెబుతున్నారు. ఈ మరాఠా కోటా గురించి ఓ కమిటీ ఏర్పాటు చేస్తామని సీఎం షిండే చెబుతున్నారు. కానీ మహారాష్ట్రలో ఆయన మాటలకు విలువ లేకుండా పోయింది.

ఓ వైపు ఇలా మరాఠా కోటా రచ్చ ఓ వైపు జరుగుతూండగానే… గతంలో పార్టీ ఫిరాయించిన వ్యవహారంలో ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు అంశం తేల్చాల్సి ఉంది. దీనిపై సుప్రీంకోర్టు కూడా స్పీకర్ కు పదే పదే గడువు నిర్దేసిస్తోంది. డిసెంబర్ చివరిలోపు నిర్ణయం తీసుకోవాలని ఇటీవల ఆదేశించింది. పార్టీ ఫిరాయిపుల నిరోధక చట్టం ప్రకారం… అనర్హతా వేటు పడుతుందన్న అభిప్రాయాలున్నాయి. దీంతో ప్రభుత్వం మనుగడ సాగించడం గగనం అవుతుంది.

ఈ పరిణామాలన్నీ కలిసి.. లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించడానికి అనువైన పరిస్థితులు కల్పిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది. మామూలుగా అయితే మహారాష్ట్ర ఎన్నికలు వచ్చే ఏడాది అక్టోబర్‌లో జరగాల్సి ఉంది. కానీ రాజకీయ అనిశ్చితి కారణంగా పార్లమెంట్ తో పాటే పెట్టేసేందుకు ప్లాన్ లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయన్న అభిప్రాయాలు అక్కడి ప్రజల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

యాక్సిస్ ఏపీ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ : కూటమికి 98 నుంచి 120 సీట్లు

దేశంలో అత్యంత ఖచ్చితమైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ప్రకటించే సంస్థగా పేరున్న యాక్సిస్ మై ఇండియా ఏపీ అసెంబ్లీ అంచనాలను ప్రకటించింది. కూటమి యాభై శాతానికిపైగా ఓట్లతో 98 నుంచి 120 సీట్ల...

జగన్‌ను ఇప్పటికీ మోసం చేస్తున్నారు !

వైసీపీకి ఘోర పరాజయం ఖాయమని అన్ని ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడి అయింది. అయితే వైసీపీకి చెందిన వారు మాత్రం ఇంకా జగన్ ను మభ్య పెట్టాలనో మోసం చేయలనో చూస్తున్నారు....

సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు నిలబెట్టుకున్న బీఆర్ఎస్

మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 108 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారు. ఇక్కడ...

అరుణాచల్, సక్కిం అసెంబ్లీలో యాక్సిస్ ఎగ్జిట్పోల్స్ వంద శాతం కరెక్ట్ !

యాక్సిస్ మై ఇండియా సంస్థ ఇండియా టుడేలో ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో ఖచ్చితత్వం మరోసారి స్పష్టమయింది. అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగిన నాలుగు రాష్ట్రాల్లో రెండు ఈశాన్యరాష్ట్రాల్లో ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close