ఏపీలో హీరో మోటార్ సైకిల్స్ సంస్థ ఏర్పాటుకు అవరోధం

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇరుగు పొరుగు రాష్ట్రాల నుండి చాలా తీవ్రమయిన పోటీని ఎదుర్కొని హీరో మోటార్ సైకిల్స్ సంస్థని ఏపీకి రప్పించగలిగారు. దక్షిణాది రాష్ట్రాలలో మొట్టమొదటిసారిగా ఆ సంస్థ తన ఉత్పత్తి కేంద్రాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లి వద్ద సుమారు రూ. 3, 000 కోట్ల పెట్టుబడితో నెలకొల్పడానికి అంగీకరించింది. అక్కడ ఏడాదికి సుమారు 20లక్షల వాహనాలు ఉత్పత్తి చేయాలని, క్రమంగా దానిని ఒక కోటి ఇరవై లక్షల వాహనాల ఉత్పత్తి చేసే స్థాయికి విస్తరించాలని ఆ సంస్థ ప్రణాళిక సిద్దం చేసుకొంది. ఏడాదికి అన్ని వాహనాలు ఉత్పత్తి చేసే ఆ సంస్థలో అనేక వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాది దొరుకుతుంది. ఆ సంస్థకి అనుబంధంగా అనేక చిన్నా, పెద్దా సంస్థలు తరలివస్తాయి. ఆ సంస్థ నుండి పన్నుల రూపంలో రాష్ట్రానికి భారీగా ఆదాయం కూడా సమకూరుతుంది.ఊహించలేని అనేక ప్రయోజనాలు ఉంటాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థకు అవసరమయిన స్థలం, అనుమతులు వగైరా అన్నీ చకచకా మంజూరు చేసింది.

అందుకోసం ఐశ్వర్య ఆర్చిడ్స్ అనే సంస్థకు చెందిన 844 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పద్దతిలో తీసుకొంది. కానీ దానికి తగిన నష్టపరిహారం ప్రభుత్వం తమకు ఇంతవరకు చెల్లించలేదని, అదేవిధంగా పునరావాస ప్యాకేజీ క్రింద తమకు ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా తమ భూమిని స్వాధీనం చేసుకొని హీరో సంస్థకు కట్టబెట్టిందని, కనుక దానిపై స్టే మంజూరు చేయాలని కోరుతూ ఐశ్వర్య ఆర్చిడ్స్ సంస్థ హైకోర్టులో ఒక పిటిషన్ వేసింది. దానిపై స్పందించిన హైకోర్టు తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆ స్థలంలో హీరో సంస్థ ఎటువంటి నిర్మాణ కార్యక్రమాలు చేప్పట్టరాదని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఆ స్థలాన్ని ‘యధాతధ స్థితి’లో ఉంచాలని ఆదేశించింది. చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి సాధించుకు వచ్చిన హీరో సంస్థ నిర్మాణానికి ఆదిలోనే ఇటువంటి అవరోధం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ సమస్యను పరిష్కరించలేకపోతే ఇటువంటి అవకాశం కొరకే ఎదురు చూస్తున్న ఇరుగుపొరుగు రాష్ట్రాలు మన హీరోని ఎత్తుకుపోయే ప్రమాదం ఉంటుంది.ఇంతకు ముందు టాటా కంపెనీ బెంగాల్ రాష్ట్రంలో నానో కార్ల ఉత్పత్తి కర్మాగారం స్థాపించేందుకు సిద్దపడినా ఆ సంస్థకు ఇచ్చిన భూముల విషయంలో ఎదురయిన సమస్యలను పరిష్కరించడంలో అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం చూపడంతో టాటా సంస్థ గుజరాత్ రాష్ట్రానికి తరలిపోయింది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా అనేక రాష్ట్రాలు టాటా కార్ల తయారీ సంస్థను తమ రాష్ట్రానికి ఆకర్షించడానికి పోటీ పడ్డాయి. ఇప్పుడు హీరో మోటార్స్ సంస్థ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో మేల్కొనకపోతే అదే విధంగా జరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే వేరే కొత్త సంస్థలు రాష్ట్రానికి రావడానికి సంకోచించవచ్చును. కనుక ముఖ్యమంత్రి, రాష్ట్రప్రభుత్వం ఎంతసేపు ఓటుకి నోటు, పుష్కరాల వంటి వాటితోనే కాలక్షేపం చేయకుండా ఇటువంటి ముఖ్యమయిన విషయాలపై కూడా అంతే శ్రద్ధ కనబరిస్తే బాగుంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో నాని

రాజ‌మౌళి - నాని కాంబోలో 'ఈగ' వ‌చ్చింది. అది సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌ళ్లీ ఈ కాంబో కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్ష‌కులు 'ఈగ 2' ఆలోచ‌న రాజ‌మౌళికి ఉంది. కానీ...

కేసీఆర్ పై ఈసీ బ్యాన్

మాజీ సీఎం కేసీఆర్ ను ప్రచారం చెయ్యకుండా ఎన్నికల కమిషన్ నిషేధించింది. ఈరోజు రాత్రి8 గంటల నుండి రెండు రోజుల పాటు అంటే 48గంటల పాటు ఈ నిషేధం అమల్లో ఉంటుంది అని...

టీడీపీ మేనిఫెస్టోకి మరిన్ని కలిపి ఆకర్షణీయంగా ప్రచారం చేస్తున్న జగన్

టీడీపీ వాళ్లు సూపర్ సిక్స్ పథకాలపై చాలా కాలంగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. వారి మేనిఫెస్టోను వారు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే వారితో పాటు జగన్ కూడా ప్రచారం చేస్తున్నారు. ...

పాన్ ఇండియా ‘సుడిగాడు’

అల్లరి నరేష్ కెరీర్ లో హిట్ సినిమా 'సుడిగాడు'. స్పూఫ్ లకు పరాకాష్టగా వచ్చిన ఆ సినిమా బాగానే నవ్వించింది. తర్వాత నరేష్ కి వరుస పరాజయాలు వచ్చాయి. ఏ సినిమా చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close