తెలంగాణలో 8 చోట్లే కాదు అన్ని స్థానాల్లో గ్లాస్ సింబల్స్ !

తెలంగాణలో జనసేన పార్టీకి గుర్తు సమస్య వచ్చిపడింది. జనసేనకు గుర్తింపు లేకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులకు కామన్ సింబల్ కేటాయించరన్న ప్రచారం జరిగింది. కానీ జనేసన విజ్ఞప్తితో జనసేన పార్టీ బీఫాంపై పోటీ చేస్తున్న అందరికీ కామన్ సింబల్ గాజు గ్లాస్ కేటాయిస్తారు. అయితే ఇంతటితో సమస్య పరిష్కారం కాలేదు. అసలు సమస్య ఇక్కడే ప్రారంభమవుతోంది. జనసేన బీఫాం ఉన్న చోట్ల గాజు గ్లాస్ ఇస్తారు. లేని చోట ఆ గుర్తు ఇండిపెండెంట్లకు ఇస్తారు. అదే అసలు సమస్య. జనసేన.. ఏపీలో మాత్రమే ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందింది. తెలంగాణలో ఆ పార్టీకి ఎలాంటి గుర్తింపు లభించలేదు.

దీంతో ఆ పార్టీ గుర్తు గాజుగ్లాస్ ను తెలంగాణలో రిజర్వ్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రాకరం జనసేన బీఫాంపై పోీట చేసే చోట్ల అందరికీ గాజు గ్లాస్ గుర్తు కేటాయించే అవకాశం ఉంది. కానీ జనసేన పార్టీ పోటీ చేయని చోట్ల గాజు గ్లాస్ గుర్తు ఇండిపెండెంట్లకు కేటాయించే అవకాశం ఉంది. ఇది కూటమిలోని పార్టీలకు ఇబ్బందికరంగా మారుతుంది. జనసేన ఓటర్లు గాజు గ్లాస్ గుర్తుకు ఓటేసే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే బీజేపీకి నష్టం జరుగుుతందన్న ఆందోళన ఉంది. అదే గుర్తింపు పొందిన పార్టీ అయితే.. పోటీ చేయకపోతే .. ఆ సింబల్ ఎవరికీ కేటాయించరు.

కానీ జనసేన విజ్ఞప్తి మేరకు కామన్ సింబల్ కేటాయిస్తున్నారు కానీ..పోటీ చేయని చోట ఇతర నియోజకవర్గాల్లో ఇతరులకు కేటాయించవద్దని కోరే అవకాశం లేదు. తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన జనసేన.. పోటీ చేయలేదు. కానీ ఆ ఎన్నికల్లో ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి తనకు గాజు గ్లాస్ గుర్తు కావాలని ఈసీని కోరడంతో ఆ గుర్తును కేటాయించారు. దీంతో ఆ గుర్తుకూ కొన్ని ఓట్లు పడ్డాయి. ఇప్పుడు తెలంగాణలోనూ అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

వివరణ కూడా అడగకుండానే ఎమ్మెల్సీపై అనర్హత !

టీడీపీలో చేరిన ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై శాసనమండలి చైర్మన్ అనర్హతా వేటు వేశారు. వైసీపీ తరఫున ఎమ్మెల్సీగా ఎంపికైన ఆయన ఇటీవల టీడీపీలో చేరారు. దీనిపై వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close