ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో కమిటీ : మోదీ

ఎస్సీ వర్గీకరణ చేస్తున్నట్లుగా ప్రకటన చేస్తారేమో అని మాదిగ విశ్వరూప సభ పెట్టి ఎదురు చూసిన మందకృష్ణ మాదిగకు.. ప్రదాని మోదీ మరిన్ని ఎదురు చూపులు తప్పవని తేల్చేశారు. ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని చెప్పారు. కానీ ఖచ్చితంగా చేస్తామని చెప్పలేదు. మాదిగలకు న్యాయం చేస్తామని .. ఈ పోరాటంలో మందకృష్ణకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాన్నారు. తన నాయకుడు మందకృష్ణేనన్నారు. ప్రతిపక్షంలో ఉన్నట్లుగా ప్రధాని మోదీ మాట్లాడటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పోరాటానికి మద్దతు కోసం .. ప్రతిపక్షాల్ని పిలుస్తారు కానీ ప్రధానిని కాదు. కానీ ప్రధాని వచ్చి పోరాటానికి మద్దతిస్తామని చెప్పి వెళ్లారు.

తాము అయితే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. మరి అంత కట్టుబడి ఉంటే పదేళ్లుగా ఎందుకు వర్గీకరణ చేయలేదన్నది మాత్రం ఆయన చెప్పలేకపోయారు. ఇప్పుడు ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా కమిటీ ఏర్పాటు ప్రకటన చేశారు. కమిటీ ఏర్పాటు చేయాలి.. ఆ కమిటీ అంతా పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీలకు సంబంధించిన విషయం మాత్రం కాదు. జరిగితే దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఇలాంటి సున్నితమైన విషయం.. చాలా పార్టీలు చలి కాచుకోవడానికి రెడీగా ఉంటాయి.

తెలంగాణ ఎన్నికల్లో మోదీ పూర్తిగా కుల సమీకరణాల మీద ఆధారపడుతున్నారు. బీసీ సీఎం ప్రకటన చేశారు. మాదిగ వర్గాలకు ..వర్గీకరణ కమిటీ హామీ ఇచ్చారు. పవన్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా మున్నూరు కాపుల్ని ఆకట్టుకున్నామనుకుంటున్నారు. మూడు వర్గాల ఓట్లతో .. విజయం సాధించాలని మోదీ ప్రయత్నిస్తున్నారు.

మోదీ వ్యూహం ప్రకారం ప్రసంగాలు చేశారు. బీసీ సభలో పవన్ ను.. మేరా సాథ్ పవన్ హై అ్నారు. మాదిగ విశ్వరూపసభలో మందకృష్ణనే తన నాయకుడన్నారు. అదే సమయంలో ఇద్దరు నేతలతో వేదికపై ఆయన వ్యవహరించిన విధానం డ్రమెటిక్ గా ఉంది. రాజకీాయల్లో ఇలాంటివి మోదీకి మాత్రమే సాధ్యమనిపించేలా మోదీ సభలు జరిగాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆఫ్రికాకు పెద్దిరెడ్డి జంప్ – చెప్పకనే చెప్పారుగా !?

మంత్రి పెద్దిరెడ్డి ఆఫ్రికాలో కాంట్రాక్టులు చేస్తున్నారట.. అందుకని ఇక్కడి తన వాహనాలన్నింటినీ ముంబై పోర్టు నుంచి ఆఫ్రికాకు ఎక్స్ పోర్టు చేసేస్తున్నారు. ఆఫ్రికాలో మైనింగ్ చేయాలనుకుంటే... ఇక్కడి నుంచే ఎందుకు...

జగన్ కు విధించబోయే మొదటి శిక్ష ఇదేనా..?

ఏపీలో కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని జోరుగా ప్రచారం జరుగుతోన్న వేళ మరో ఆసక్తికర చర్చ జరుగుతోంది. శాసన సభాపతి చైర్ లో ఎవరిని కూర్చోబెట్టనున్నారు..? అనే దానిపై బిగ్ డిస్కషన్ కొనసాగుతోంది....

రూట్ మార్చిన అధికారులు – ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామం

ఏపీ రాజకీయాల్లోనే కాదు అధికార వర్గాల్లోనూ మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంకేతాలతో టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లేందుకు చాలామంది అధికారులు ప్రయత్నాలు చేస్తుండటం...

మంచు మ‌నోజ్‌… మోస్ట్ డేంజ‌రెస్

మంచు మ‌నోజ్ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభ‌మైంది. త‌ను వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్ లో వెరైటీగా విల‌న్ పాత్ర‌ల‌పై మోజు పెంచుకొన్నాడు. త‌న‌కు అలాంటి అవ‌కాశాలు ఇప్పుడు బాగా వస్తున్నాయి. 'మిరాయ్‌'లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close