ఆర్కే పలుకు : వచ్చే ఎన్నికలు జగన్ వర్సెస్ ప్రజలు !

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారిని గంగిరెద్దులతో పోల్చారు. ఇంకా చెప్పాలంటే పోలిక కోసమే కానీ ఆ గంగిరెద్దులు ఎంతో గౌరవనీయమన్నారు. సివిల్ సర్వీస్ అధికారులపై ఆర్కేకు ఇంత కోపం రావడానికి కారణం… నిబంధనలు పాటించకుండా… పార్టీ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనడం. ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ జెండాలు ఎగురవేయడం వంటి పనులు చేయడమే కాకుండా నేరుగా ఎన్నికల అధికారిని కూడా మద్యం కేసులో ఇరికిస్తామని బెదిరించి ఓటర్ల జాబితాలో అవకతవకలు సరి చేయకుండా చూసుకుంటున్నారు., పెద్ద ఎత్తున అనుకున్నట్లుగా దొంగ ఓట్లు చేరుస్తున్నారు. ఇదంతా తెలిసి ఆర్కేకు కోపం వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితుల్ని చూసి న్యాయవ్యవస్థ కూడా నిస్సహాయంగా ఉండిపోయింది.. చట్టం రాజ్యాంగం ఏమీ లేదని ఆయన ఫీలయ్యారు. నిజానికి ఇది నాలుగున్నరేళ్లుగా సాగుతోంది. కానీ ఏపీలో ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ప్రభుత్వం చెప్పినట్లుగా చేయడం లేదు. 90 శాతం మంది నిబంధనల ప్రకారమే పని చేస్తున్నారు. కానీ తమ అడుగులకు మడుగులు ఒత్తే అధికారుల్ని మాత్రమే తమకు కావాల్సిన చోట పెట్టుకుని పని నడిపించేస్తున్నారు ఏపీ పెద్దలు. మిగిలిన వారు నోరు తెరవలేకపోతున్నారు. దానికి సీఐడీ అనే ఓ మాఫియాను తయారు చేశారు., ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. ఆధారాలతో పని లేదు.. ఏదో ఓ కేసు పెట్టి బొక్కలో వేస్తారు. పరువు తీస్తారు. కోర్టుల్లో ఎప్పటికో ఊరట లభిస్తుంది. తప్పు చేయకుండానే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ బాధ ఎందుకని వారంతా సైలెంట్ గా ఉంటున్నారు. కానీ బరి తెగించిన వారికి తెడ్డే లింగం అన్నట్లుగా కొంత మంది అధికారులు మాఫియా రూల్ లో భాగం అయి…. తోటి అధికారుల్నే బెదిరిస్తున్నారు.

ఎన్నికల అధికారిని సీఐడీ కేసులో ఇరికిస్తామని బెదిరించడం చిన్న విషయం కాదు. చంద్రబాబుపై ఇటీవల మద్యం కేసును పెట్టారు. ఆ ఎక్సైజ్ శాఖలో గతంలో … ప్రస్తుత సీఈవో మీనా పని చేశారు. మద్యం కేసులోనే ఎలాంటి ఆధారాలు లేవు అంటే ఆయననూ ఇరికిస్తామని చెప్పి బెదిరింపులకు దిగారు. చివరికి ఆయన ఓటర్ల జాబితాలో అవకతవకలపై మిన్నకుండిపోతున్నారు. ఇటీవల కొంత మందిపై చర్యలు తీసుకున్నా తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఏపీకి జగన్ రెడ్డి అవసరమా ? మరోసారి జగన్ రెడ్డి సీఎం అయితే ప్రజల బతుకులు.. ఏపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలవాలని ఆర్కే చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలు వర్సెస్ జగన్ అన్నట్లుగా ఎన్నికలు జరగబోతున్నాయి. దీన్నే ఆర్కే విశ్లేషించారు. పోలీసులు, రౌడీలు, దొంగ ఓటర్లు వంటి ఆయుధాలతో జగన్ రెడ్డి ఎన్నికలయుద్ధం చేయబోతున్నారు. దాన్ని ఎదుర్కొని ప్రజలు… తమ రాష్ట్రాన్ని గెలిపించుకుంటే సరే.. లేకపోతే ఇక రాష్ట్రాన్ని మర్చిపోవచ్చని ఆర్కే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

లోక్ సభ ఎన్నికలు…బీఆర్ఎస్ కు సెంటిమెంట్ అస్త్రం దొరికిందోచ్

లోక్ సభ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్మరణ సమస్యగా మారాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాల్సిన అనివార్యత బీఆర్ఎస్ కు ఏర్పడింది. కానీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీ మెజార్టీ సీట్లు గెలుచుకునే...

తండేల్ @ రూ.40 కోట్లు

నాగచైతన్య 'తండేల్' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నారు. కార్తికేయ2 తర్వాత చందూ మొండేటి నుంచి వస్తున్న సినిమా ఇది. బన్నీ వాస్‌ నిర్మాత. సాయిపల్లవి కథానాయిక. అల్లు అరవింద్‌ సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ...

బిగ్ న్యూస్ – సీఎస్ పేరుతో సైబర్ మోసాలు

తెలంగాణలో పోన్ ట్యాపింగ్ ప్రకంపనలు రేగుతోన్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. శాంతి కుమారి ఫోటోను డీపీగా...

వైసీపీకి ‘చిరు’ బెంగ

ఏపీ ఎన్నికల్లో ఉత్కంఠను రేకెత్తిస్తున్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఉదృతంగా సాగుతోంది. ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close