ఎస్సీ వర్గీకరణ కోసం త్వరలో కమిటీ : మోదీ

ఎస్సీ వర్గీకరణ చేస్తున్నట్లుగా ప్రకటన చేస్తారేమో అని మాదిగ విశ్వరూప సభ పెట్టి ఎదురు చూసిన మందకృష్ణ మాదిగకు.. ప్రదాని మోదీ మరిన్ని ఎదురు చూపులు తప్పవని తేల్చేశారు. ఎస్సీ వర్గీకరణకు కమిటీ వేస్తామని చెప్పారు. కానీ ఖచ్చితంగా చేస్తామని చెప్పలేదు. మాదిగలకు న్యాయం చేస్తామని .. ఈ పోరాటంలో మందకృష్ణకు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాన్నారు. తన నాయకుడు మందకృష్ణేనన్నారు. ప్రతిపక్షంలో ఉన్నట్లుగా ప్రధాని మోదీ మాట్లాడటం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. పోరాటానికి మద్దతు కోసం .. ప్రతిపక్షాల్ని పిలుస్తారు కానీ ప్రధానిని కాదు. కానీ ప్రధాని వచ్చి పోరాటానికి మద్దతిస్తామని చెప్పి వెళ్లారు.

తాము అయితే ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామన్నారు. మరి అంత కట్టుబడి ఉంటే పదేళ్లుగా ఎందుకు వర్గీకరణ చేయలేదన్నది మాత్రం ఆయన చెప్పలేకపోయారు. ఇప్పుడు ఎన్నికలకు నాలుగు నెలల ముందుగా కమిటీ ఏర్పాటు ప్రకటన చేశారు. కమిటీ ఏర్పాటు చేయాలి.. ఆ కమిటీ అంతా పరిశీలన జరిపి నివేదిక ఇవ్వాలి. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి. కానీ ఇది తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీలకు సంబంధించిన విషయం మాత్రం కాదు. జరిగితే దేశవ్యాప్తంగా అమలు చేయాలి. ఇలాంటి సున్నితమైన విషయం.. చాలా పార్టీలు చలి కాచుకోవడానికి రెడీగా ఉంటాయి.

తెలంగాణ ఎన్నికల్లో మోదీ పూర్తిగా కుల సమీకరణాల మీద ఆధారపడుతున్నారు. బీసీ సీఎం ప్రకటన చేశారు. మాదిగ వర్గాలకు ..వర్గీకరణ కమిటీ హామీ ఇచ్చారు. పవన్ తో పొత్తు పెట్టుకోవడం ద్వారా మున్నూరు కాపుల్ని ఆకట్టుకున్నామనుకుంటున్నారు. మూడు వర్గాల ఓట్లతో .. విజయం సాధించాలని మోదీ ప్రయత్నిస్తున్నారు.

మోదీ వ్యూహం ప్రకారం ప్రసంగాలు చేశారు. బీసీ సభలో పవన్ ను.. మేరా సాథ్ పవన్ హై అ్నారు. మాదిగ విశ్వరూపసభలో మందకృష్ణనే తన నాయకుడన్నారు. అదే సమయంలో ఇద్దరు నేతలతో వేదికపై ఆయన వ్యవహరించిన విధానం డ్రమెటిక్ గా ఉంది. రాజకీాయల్లో ఇలాంటివి మోదీకి మాత్రమే సాధ్యమనిపించేలా మోదీ సభలు జరిగాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ చివరి ప్రయత్నాలు : ఫేక్ ఎడిట్లు, మార్ఫింగ్‌లు, దొంగ నోట్లు, దాడులు

ఎన్నికల్లో గెలవాలంటే ఎవరైనా ప్రజలతో ఓట్లేయించుకోవడానికి చివరి క్షణం వరకూ ఏం చేయాలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ వైసీపీ డీఎన్‌ఎలో ప్రజల్ని పరిగణనలోకి తీసుకోవడం అనేదే ఉండదు. గెలవాలంటే తమకు వేరే...

కాంగ్రెస్ గూటికి శ్రీకాంతా చారి తల్లి… ఎమ్మెల్సీ ఖాయమా..?

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ , మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి ఆమెను...

పవన్ కళ్యాణ్ వెంటే బన్నీ

జనసేనాని పవన్ కళ్యాణ్ కు హీరో అల్లు అర్జున్ శుభాకాంక్షలు తెలిపారు. పవన్ ఎంచుకున్న మార్గం తనకు గర్వకారణమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు....

బ్ర‌హ్మానందం…. ఇదే చివ‌రి ఛాన్స్!

బ్ర‌హ్మానందం త‌న‌యుడు గౌత‌మ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఏకంగా 20 ఏళ్ల‌య్యింది. 2004లో 'ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు' విడుద‌లైంది. అప్ప‌టి నుంచీ... బ్రేక్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో 'బ‌సంతి' కాస్త...

HOT NEWS

css.php
[X] Close
[X] Close