ఆర్కే పలుకు : వచ్చే ఎన్నికలు జగన్ వర్సెస్ ప్రజలు !

ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఈ వారం ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వారిని గంగిరెద్దులతో పోల్చారు. ఇంకా చెప్పాలంటే పోలిక కోసమే కానీ ఆ గంగిరెద్దులు ఎంతో గౌరవనీయమన్నారు. సివిల్ సర్వీస్ అధికారులపై ఆర్కేకు ఇంత కోపం రావడానికి కారణం… నిబంధనలు పాటించకుండా… పార్టీ కార్యక్రమాల్లో అధికారులు పాల్గొనడం. ప్రభుత్వ కార్యాలయాల్లో వైసీపీ జెండాలు ఎగురవేయడం వంటి పనులు చేయడమే కాకుండా నేరుగా ఎన్నికల అధికారిని కూడా మద్యం కేసులో ఇరికిస్తామని బెదిరించి ఓటర్ల జాబితాలో అవకతవకలు సరి చేయకుండా చూసుకుంటున్నారు., పెద్ద ఎత్తున అనుకున్నట్లుగా దొంగ ఓట్లు చేరుస్తున్నారు. ఇదంతా తెలిసి ఆర్కేకు కోపం వచ్చింది.

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిస్థితుల్ని చూసి న్యాయవ్యవస్థ కూడా నిస్సహాయంగా ఉండిపోయింది.. చట్టం రాజ్యాంగం ఏమీ లేదని ఆయన ఫీలయ్యారు. నిజానికి ఇది నాలుగున్నరేళ్లుగా సాగుతోంది. కానీ ఏపీలో ఐపీఎస్, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ప్రభుత్వం చెప్పినట్లుగా చేయడం లేదు. 90 శాతం మంది నిబంధనల ప్రకారమే పని చేస్తున్నారు. కానీ తమ అడుగులకు మడుగులు ఒత్తే అధికారుల్ని మాత్రమే తమకు కావాల్సిన చోట పెట్టుకుని పని నడిపించేస్తున్నారు ఏపీ పెద్దలు. మిగిలిన వారు నోరు తెరవలేకపోతున్నారు. దానికి సీఐడీ అనే ఓ మాఫియాను తయారు చేశారు., ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. ఆధారాలతో పని లేదు.. ఏదో ఓ కేసు పెట్టి బొక్కలో వేస్తారు. పరువు తీస్తారు. కోర్టుల్లో ఎప్పటికో ఊరట లభిస్తుంది. తప్పు చేయకుండానే శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఈ బాధ ఎందుకని వారంతా సైలెంట్ గా ఉంటున్నారు. కానీ బరి తెగించిన వారికి తెడ్డే లింగం అన్నట్లుగా కొంత మంది అధికారులు మాఫియా రూల్ లో భాగం అయి…. తోటి అధికారుల్నే బెదిరిస్తున్నారు.

ఎన్నికల అధికారిని సీఐడీ కేసులో ఇరికిస్తామని బెదిరించడం చిన్న విషయం కాదు. చంద్రబాబుపై ఇటీవల మద్యం కేసును పెట్టారు. ఆ ఎక్సైజ్ శాఖలో గతంలో … ప్రస్తుత సీఈవో మీనా పని చేశారు. మద్యం కేసులోనే ఎలాంటి ఆధారాలు లేవు అంటే ఆయననూ ఇరికిస్తామని చెప్పి బెదిరింపులకు దిగారు. చివరికి ఆయన ఓటర్ల జాబితాలో అవకతవకలపై మిన్నకుండిపోతున్నారు. ఇటీవల కొంత మందిపై చర్యలు తీసుకున్నా తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇలాంటి పరిస్థితుల నడుమ ఏపీకి జగన్ రెడ్డి అవసరమా ? మరోసారి జగన్ రెడ్డి సీఎం అయితే ప్రజల బతుకులు.. ఏపీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలవాలని ఆర్కే చెప్పుకొచ్చారు.

వచ్చే ఎన్నికల్లో ప్రజలు వర్సెస్ జగన్ అన్నట్లుగా ఎన్నికలు జరగబోతున్నాయి. దీన్నే ఆర్కే విశ్లేషించారు. పోలీసులు, రౌడీలు, దొంగ ఓటర్లు వంటి ఆయుధాలతో జగన్ రెడ్డి ఎన్నికలయుద్ధం చేయబోతున్నారు. దాన్ని ఎదుర్కొని ప్రజలు… తమ రాష్ట్రాన్ని గెలిపించుకుంటే సరే.. లేకపోతే ఇక రాష్ట్రాన్ని మర్చిపోవచ్చని ఆర్కే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close