అబ్బో..మమతా దీదీ ఎన్నికలకు సిద్దంగానే ఉన్నారే!

అసోం, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ మరియు పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారంనాడు ప్రకటించింది. ఆ ప్రకటన వెలువడిన కొద్ది సేపటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలో గల 294 స్థానాలకు తమ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల పేర్లను ప్రకటించేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అంటే ఈ ఎన్నికలను ఎదుర్కోవడానికి ఆమె చాలా ముందు నుంచే సిద్దం అయ్యేరని అర్ధమవుతోంది.

ఈ ఎన్నికలలో తృణమూల్ తో పొత్తులు పెట్టుకోవాలని ఆశపడిన కాంగ్రెస్ పార్టీకి ఆమె దీనితో పెద్ద షాకే ఇచ్చినట్లయింది. కనుక కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో చేతులు కలిపే ప్రయత్నం చేయవచ్చును. మమతా బెనర్జీ ఇంత సంసిద్ధంగా ఉన్నట్లు బీజేపీ కూడా ఊహించక పోవడంతో అది కూడా షాక్ తింది. డిల్లీ, బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం ఆ కారణంగా తీవ్ర అప్రదిష్టను మూటగట్టుకొన్న మోడీ ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలలోనయినా గౌరవ ప్రధమయిన స్థానాలు సంపాదించుకోవాలనుకొంటోంది. కానీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రదర్శించిన ఈ దూకుడుతో కంగు తిని ఉండవచ్చును. ఈ ఎన్నికలలో ఎవరితో పొత్తులు పెట్టుకోకుండా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసి గెలవగలదన్నట్లుగా ఆమె కనబరుస్తున్న ఆత్మవిశ్వాసం, బీజేపీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేట్లుగా ఉంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల కోసం ఆమె నిన్న ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో మొత్తం 45మంది మహిళలకు, 57మంది మైనార్టీలకు అవకాశం కల్పించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close