దారి చూపిస్తున్న కోటంరెడ్డి – టీడీపీ నేతలదే ఆలస్యం !

నెల్లూరు రూరల్ టీడీపీ ఇంచార్జ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్లే విధానం భిన్నంగా ఉంటుంది. వైసీపీలో ఉన్నప్పటికీ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేయడంలో ఎప్పుడూ తగ్గలేదు. ఇప్పుడు విపక్ష పార్టీలోకి మారిపోయి.. వచ్చే ఎన్నికల కోసం వినూత్నంగా సిద్ధమవుతున్నారు. ఆయన ఇప్పుడు లక్ష మంది ప్రజలను నేరుగా కలిసి సమస్యలు వినేందుకు సిద్ధమయ్యారు. ఒక్కడే ఒంటరిగా లక్ష మందితో మాటా మంతి పేరుతో వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్‌నారు. క్ష మందిని కలిసి మాట మంతి ద్వారా సమస్యలు తెలుసుకొనున్నారు.

ఈ నెల 25వ తేదీ నుంచి 33 రోజుల పాటు ‘ఒక్కడే.. ఒంటరిగా..’ పేరుతో కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.. ఇందులో భాగంగా లక్ష మంది ప్రజల్ని నేరుగా ముఖాముఖి కలసి వారితో మాట్లాడతానన్నారు. మీడియా కూడా లేకుండా కార్యక్రమం నిర్వహిస్తానని వెల్లడించారు కోటంరెడ్డి. ఎవరూ లేకుండా ఒంటరిగా వెళ్తేనే ప్రజలు తనతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మాట్లాడతారని తెలిపారు. గతంలో కూడా కోటంరెడ్డి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టేవారు. ఎన్నికల టైమ్ లో నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్తున్నారు కోటంరెడ్డి ప్రజల్ని నేరుగా కలవడం కంటే ఓ నాయకుడికి పెద్ద ప్లస్ పాయింట్ ఉండదు. శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ జనంలో ఉంటారు. ఆయన అగ్రెసివ్ గా ఉండే లీడర్. కానీ వైసీపీ అంతర్గత రాజకీయాల్లో నలిగిపోయారు.

చివరికి నియోజకవర్గానికి వెళ్లవద్దన్న హెచ్చరికలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన రాజకీయం మారిపోయింది. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసులు పెట్టినా తగ్గలేదు. టీడీపీ నేతలు కూడా కోటంరెడ్డిలా ప్రజల్లోకి వెళ్తే తిరుగు ఉండదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కాంగ్రెస్ జిల్లాల జోలికెళ్తే బీఆర్ఎస్‌ చేతికి సెంటిమెంట్ అస్త్రం !

తెలంగాణలో రాజకీయ అవసరాల కోసం ఏర్పాటు చేసిన జిల్లాలతో పాలనా పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కో జిల్లాలో ఇద్దరు, ముగ్గురు జడ్పీటీసీలు లేని పరిస్థితి ఉంది. ఈ సమస్యలన్నింటినీ...

బీజేపీ మొదటి టార్గెట్ బీఆర్ఎస్సే !

ఎన్నికల ఫలితల తర్వాత బీఆర్ఎస్ ఉండదని కిషన్ రెడ్డి మాత్రమే కాదు బండి సంజయ్ సహా బీజేపీ నేతలందరూ చెబుతున్నారు. వారు ఈ మాటల్ని ఆషామాషీగా అనడం లేదు. అందుకే...

ఎన్నికలు ముగిసిన రేవంత్‌ ముందరి కాళ్లకు బంధమే !

లోక్ సభ ఎ్నికల పోలింగ్ ముగిసింది. దూకుడుగా నిర్ణయాలు తీసుకుందామనుకుంటున్న రేవంత్ కు ఈసీ ముందరి కాళ్లకు బంధం వేస్తోంది. కనీసం కేబినెట్ సమావేశాన్ని కూడా స్వేచ్చగా ఏర్పాటు చేసుకునే అవకాశం...

ఓటును రూ. 5వేలకు అమ్ముకున్న మంగళగిరి ఎస్‌ఐ

మంగళగిరి ఎస్ఐను సస్పెండ్ చేశారు. ఎందుకంటే ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకో.. వైసీపీ లీడర్‌కు కొమ్ము కాసినందుకో కాదు.. తన ఓటును ఐదు వేలకు అమ్ముకున్నందుకు. ఆధారాలతో సహా దొరికిపోవడంతో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close