అధికారుల హంటింగ్ ఉండదు : రేవంత్ రెడ్డి

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్‌కు సహకరిస్తున్న అధికారుల పేర్లను రెడ్ బుక్‌లో రాసుకున్నామని .. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరిస్తూ ఉండేవారు. ఎన్నికల ప్రచారంలో కూడా అదే చెప్పారు. అందుకే రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా మంది కీలక పొజిషన్లలో ఉన్న అధికారులు రేవంత్ ను కలిసేందుకు మొహమాటపడ్డారు. వారంతా బీఆర్ఎస్ తో ఓపెన్ గా కలిసి పనిచేశారు. ప్రతిపక్ష నేతలు.. ముఖ్యంగా రేవంత్ రెడ్డిపై కూడా వేధింపులకు పాల్పడ్డారు. ఇప్పుడు వారంతా కంగారు పడుతున్నారు.

స్మితా సభర్వాల్, జయేష్ రంజన్, అర్వింద్ కుమార్ వంటి అధికారులు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ ను కలవడానికి సంకోచిస్తున్నారు. సంప్రదాయానికైనా వచ్చి అభినందనలు చెప్పలేకపోయారు. కానీ రేవంత్ రెడ్డి అలాంటి అధికారులందరికీ భరోసా ఇస్తున్నారు. అధికారుల హంటింగ్ ఉండదని మీడియా చిట్ చాట్‌లో చెప్పుకొచ్చారు. అయితే బదిలీలు మాత్రమే ఉంటాయన్నారు. ఆ బదిలీలల్లో కూడా పైరవీలు ఉండవని స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో కమిషనర్లుగా నియమితులైన వారిలో ఒక్కరు కూడా పోస్టింగ్ కోసం తనను కలవలేదన్నారు. రేవంత్ రెడ్డి మాటలు.. బీఆర్ఎస్ తో కలిసి పని చేసిన వారికి కాస్త ధైర్యం ఇస్తున్నాయని అనుకోవచ్చు. ఏపీలో అధికారుల్ని.. ఎలా ఉపయోగించుకున్నారో.. వారిలో వారిైప కేసులు పెట్టడానికి తప్పుడు స్టేట్ మెంట్లు కూడా ఎలా ఇప్పించుకున్నారో తెలంగాణ ఐఏఎస్ అధికారులు కూడా కథలు కథలుగా చెప్పుకుటున్నారు.

అక్కడ ప్రభుత్వం మాత్రం నిండా మునిగిపోయేవారు ఉన్నారని.. కానీ ఇక్కడ మాత్రం అధికారుల హంటింగ్ ఉండదని నేరుగా సీఎం చెప్పడంతో రిలీఫ్ ఫీలవుతున్నారు. రెడ్ బుక్ ను రేవంత్ రెడ్డి లోపల పెట్టేసినట్లేనని నమ్మకంగా ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీకి యంత్రాంగం సహకరించడం లేదా ?

పోలింగ్ అనంతర హింసను అరికట్టడంలో డీజీపీకి పూర్తి స్థాయిలో యంత్రాంగం సహకరించడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ అంశంపై ఈసీకి కూడా ఫిర్యాదులు అందడంతో ఏపీ సీఎస్ తో పాటు...

టెన్షన్ లో వైసీపీ ఫైర్ బ్రాండ్స్..!!

ఏపీ ఎన్నికల ట్రెండ్స్ వైసీపీకి ఘోర పరాజయం తప్పదని తేల్చుతుండటంతో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్స్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. హోరాహోరీ పోరులో గెలిచి నిలుస్తారా..? దారుణమైన పరాభవం చవిచూస్తారా..?...

సూర్య‌, కార్తి సినిమా… రౌడీ చేతుల్లో?!

విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా మైత్రీ మూవీస్‌ బ్యాన‌ర్‌లో ఓ సినిమా రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్‌ ద‌ర్శ‌కుడు. ఇదో పిరియాడిక‌ల్ యాక్ష‌న్ డ్రామా. విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన రోజున...

2 శాతం ఎక్కువ – ఏపీ ఓటర్లలో చైతన్యం ఎక్కువే !

ఎవరికి ఓటేస్తారన్న విషయం పక్కన పెడితే ఎలాగైనా ఓటేయాలన్న ఓ లక్ష్యాన్ని ఓటర్లు ఖచ్చితంగా అందుకుంటున్నారు. అది అంతకంతకూ పెరిగిపోతోంది. 2014తో పోలిస్తే 2019లో ఒక్క శాతం పోలింగ్ పెరగ్గా 2019తో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close