ఏపీలో దొంగ ఓట్లపై ఢిల్లీలో వైసీపీ రివర్స్ ఫిర్యాదులు

వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లుగా ఓటర్ల జాబితాను మార్చేస్తున్న వైసీపీ సర్కార్ నిర్వాకం సంచలనం సృష్టిస్తూంటే. రివర్స్ లో టీడీపీపై ఈసీకి ఫిర్యాదు చేశారు విజయసాయిరెడ్డి బృందం. టీడీపీ ఎలా ఓట్ల అక్రమాలకు పాల్పడుతుందో వివరించారు. అయితే.. విజయసాయిరెడ్డి చెప్పినది చూస్తే.. వైసీపీ ఏం చేస్తుందో చెప్పినట్లుగా ఉందని ఎవరికైనా అనిపిస్తుంది. టీడీపీ నేతలు ఏపీలో 40,76,580 దొంగ ఓట్లు ఓటర్ జాబితాలో చేర్పించారని ఫిర్యాదు చేశారు. ఒకే ఫోటోతో ఇంటి పేరు మార్చి పలు ప్రాంతాలలో ఓటరులుగా టీడీపీ సానుభూతిపరుల పేర్లు నమోదయ్యాయని చెప్పారు.

హైదరాబాద్ , కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలలో నివసిస్తున్న టీడీపీ సానుభూతిపరుల ఓట్లు ఏపీలో కూడా టీడీపీ నేతలు నమోదు చేయించారని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుల ఓటర్లు తొలగించేందుకు ఫారం -7 దరఖాస్తులు బీఎల్వోలకు టీడీపీ నేతలు సమర్పిస్తున్నారని తెలిపారు. నిజానికి ఇవన్నీ చేసింది వైసీపీనే. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే లక్షల కొద్దీ ఫామ్ సెవన్ లో పెట్టించి దొరికిపోయారు. వారు అధికారంలో ఉండటంతో ఇప్పుడు వారే ఫామ్ 7లు పెట్టి వారే ఓట్ల తొలగిస్తున్నారు. ఇక వాలంటీర్ల ద్వారా తాము సమాచారాన్ని సేకరిస్తున్న వైనాన్ని కాస్త మార్చి.. టీడీపీ అలా సేకరిస్తోందని చెప్పుకొచ్చారు ప్రతి ముఫ్పై ఇళ్లకు ఓ కార్యకర్తను నియమించారని వారి ద్వారా కులాన్ని తెలుసుకోవడం ద్వారా పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. సమాచారాన్ని సేకరించి న్యూయార్క్ , లండన్ సర్వర్లలో భద్ర పరుస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. బహుశా.. వైసీపీ ఇదే చేస్తూండవచ్చని సెటైర్లు వినిపిస్తున్నాయి. ఇలా వాలంటీర్లు ప్రజల ప్రతి సమాచారాన్ని సేకరిస్తున్నారు.

మరో వైపు తాము చేసే ఫిర్యాదుల్నే పరిశలించాలని టీడీపీ వారివివద్దని విజయసాయిరెడ్డి విజ్ఞాపతన పత్రం ఇచ్చారు. టీడీపీ స్టేట్ కోఆర్డినేటర్ సురేష్ కోనేరు ఫిర్యాదులు చేస్తూ టీడీపీ ఎన్నికల సంఘం అధికారుల సమయాన్ని వృధా చేసేలా తప్పుడు ఫిర్యాదులు ఇస్తున్నారని సురేష్ కోనేరు వంటి వ్యక్తులు ఇచ్చే బల్క్ ఫిర్యాదులపై సమయం వృధా చేసుకోవద్దని విజయసాయిరెడ్డి సూచించారు. విజయసాయిరెడ్డి తీరు చూసి ఎన్నికల అధికారులు కూడా ఆశ్చర్యపోయి ఉంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలాంటి పెళ్లి చేసుకోను: ఫరియా అబ్దుల్లాతో చిట్ చాట్

‘జాతిరత్నాలు’ సినిమాతో మెరిసింది ఫరియా అబ్దుల్లా. ‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే.. ఫట్టుమని పేలిందా నా గుండె ఖలాసే’ అంటూ యూత్ హృదయాల్ని కొల్లగొట్టింది. ఇప్పుడు అల్లరి నరేష్ కి జోడిగా...

వేలంపాట మాదిరి వైసీపీ మేనిఫెస్టో..!?

వైసీపీ మేనిఫెస్టో చూసిన వారందరికీ వేలంపాట గుర్తుకు రాక మానదు. టీడీపీ ఒకటి అంటే...మేము రెండు అంటాం అనే తరహలో వైసీపీ మేనిఫెస్టోను రూపొందించినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం అంచనా...

వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల...

సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close