వైజాగ్ నుంచి పాలన… జగన్ ను జనం విశ్వసించేనా..?

మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధాని లేకుండా చేసిన జగన్ రెడ్దికి ఎన్నికల్లో క్యాపిటల్ ఫియర్ పట్టుకున్నట్లు కనిపిస్తోంది. రెండో దఫా అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగా పాలన కొనసాగుతోందని మేనిఫెస్టో విడుదల సందర్భంగా జగన్ ప్రకటించారు. నాలుగేళ్లుగా రాజధానిపై కాలయాపన చేసిన జగన్ మరోసారి అధికారంలోకి వస్తే విశాఖ కేంద్రంగానైనా పరిపాలన కొనసాగిస్తారా.? అనే ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.

2014లో ఉమ్మడి రాష్ట్ర విభజనతో ఏపీకి రాజధానిగా అమరావతిని నాటి టీడీపీ సర్కార్ నిర్ణయించింది. కానీ,2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులను ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూల్ న్యాయ రాజధానిగా ప్రకటించింది. నాలుగేళ్లు అవుతున్నా రాజధానుల విషయంలో వైసీపీ సర్కార్ ఎలాంటి పురోగతి సాధించలేకపోయింది.

మూడు రాజధానుల పేరుతో ఉన్న ఒక్క రాజధానిని కూడా లేకుండా చేశారని నాలుగేళ్లుగా జగన్ సర్కార్ పై ఏపీ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతూ వచ్చాయి. ఖండంతారాల్లో ఉన్న ఏపీ వాసులు కూడా జగన్ మూడు రాజధానుల నిర్ణయంపై పెదవి విరిచారు. ఎన్నికల్లో మూడు రాజధానుల అంశం ప్రధాన ఎజెండాగా మారింది. ప్రపంచంలో రాజధాని లేని ఏకైక రాష్ట్రంగా ఏపీని మార్చారని జగన్ సర్కార్ పై సొంత చెల్లి షర్మిలతో సహా ప్రతిపక్ష నేతలు నిప్పులు చెరుగుతున్నారు.

ఇది వైసీపీకి ఎన్నికల్లో ప్రతిబంధకంగా మారుతుందని అంచనా వేశారేమో కానీ, మేనిఫెస్టో విడుదల సందర్భంగా వైసీపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక విశాఖ కేంద్రంగా పరిపాలన కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. దసరా నాటికి విశాఖ వేదికగా పరిపాలన అంటూ వైసీపీ నేతలు ఊదరగొడుతూ వచ్చినా అది సాధ్యం కాలేదు. చట్టపరంగా మూడు రాజధానులు సాధ్యం కాదని తెలిసినా మేనిఫెస్టోలో చేర్చడం ఆశ్చర్యపరుస్తోంది.దాంతో మరోసారి వైసీపీ అధికారంలోకి వచ్చినా రాజధాని విషయంలో ముందడుగు పడేనా అంటూ జనాలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close