సేమ్ మేనిఫెస్టో : ఆశలు వదిలేసుకున్న జగన్ !

వైసీపీ అధినేత జగన్ ఈ ఎన్నికలపై ఆశలు వదిలేసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఏ మాత్రం అమలు చేయలేపోయిన గత ఎన్నికల మేనిపెస్టోను మళ్లీ ప్రకటించారు. కాకపోతే గతం కన్నా కాస్తంత ఎక్కువ డబ్బులు ఇస్తానని చెప్పుకొచ్చారు. పథకాల అమలులో అసలు లబ్దిదారుల కన్నా.. అర్హత పేరుతో ఎలిమినేట్ చేసిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. అర్హతలు మారుస్తామని కూడా చెప్పలేదు.

గత మేనిఫెస్టోలో చేయలేనివి కూడా ఈ మేనిఫెస్టోలో పెట్టారు. ఐదేళ్ల పాటు ఇదిగో అదిగో అన్న పనులు.. పథకాలను కొత్త మేనిఫెస్టోలో పెట్టారు. గేమ్ ఛేంజర్ గా ఉంటుందని అందరూ అనుకునే వృద్ధుల పెన్షన్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి అతి తెలివికి పోయినట్లుగా కనిపిస్తోంది. మరో నాలుగేళ్ల పాటు మూడు వేల పెన్షనే ఉంటుందని వచ్చే ఎన్నికలకు ముందు రెండు విడతలుగా రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుతానని హామీ ఇచ్చారు. చంద్రబాబు ఇప్పటికే నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్ కూడా నాలుగు వేలు చేస్తారని అనుకున్నారు. కానీ అలాంటి ఆలోచన లేదని .. మరో ఐదేళ్ల వరకూ కూడా మూడువేలే ఉంటుందని తేల్చేశారు.

ఇతర పథకలకు డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పారు. కానీ వృద్ధుల పెన్షన్ విషయంలో మాత్రం వెనుకడుగు వేశారు. గత మేనిఫెస్టోలో రాజధాని అంశం పెట్టలేదు. సారి విశాఖ పరిపాలనా రాజధాని చేస్తామన్నారు. చట్టపరంగా సాధ్యం కాని అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టడం వైసీపీకే సాధ్యం. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని చెప్పుకచ్చారు. గతంలో గెలిచిన ేడాదిలో పూర్తి చేస్తామన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే సూపర్ సిక్స్ పేరుతో మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లారు. మూడు ఉచిత సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, నాలుగు వేలపెన్షన్ ప్రజల్లో విస్తృత చర్చకు కారణం అవుతోంది. ఇలాంటి సమయంలో జగన్ మేనిఫెస్టో తేలిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏబీవీ సర్వీస్ ఐదేళ్ల పాటు పొడిగిస్తారా !?

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీవీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ అక్రమం అని క్యాట్ తీర్పు చెప్పింది. ఆయన జీతభత్యాలు మొత్తం ఇవ్వాలని చెప్పింది. ఓ ఐపీఎస్ ఆఫీసర్ టార్గెట్ జీతభత్యాలు మాత్రమే పొందడం...

వివేకం సినిమా… సీమలో వైసీపీని డ్యామేజ్ చేస్తుందా..?

రాయలసీమలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తోన్న వైసీపీ వివేకం సినిమా తమ ఆశలకు గండికొడుతుందని ఆందోళన చెందుతోంది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డిని...

వైసీపీ ప్రచారంలో కనిపించని ఎంపీలు కృష్ణయ్య, నత్వానీ !

జగన్ మోహన్ రెడ్డి ఏరికోరి పదవులు ఇచ్చిన వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎన్నికలు జరుగుతూంటే పత్తా లేకుండా పోయారు. సొంతపార్టీ నేతల్లో వేమిరెడ్డి టీడీపీ తరపున పోటీ చేస్తూంటే విజయసాయిరెడ్డి నేరుగా...

ఈ సారి అంబాని, అదానీల గురించి మోదీ చెబుతున్నారేంటో !?

ఎప్పుడు ఎన్నికలు జరిగినా మోడీ గురించి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేసే విమర్శల్లో ప్రధానంగా వినిపించేవి.. కనిపించేవి ఆయన కార్పొరేట్ మిత్రులు అంబానీలు..అదానీల గురించిన విమర్శలు. ఈ సారి రాహుల్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close