వసంత కృష్ణ ప్రసాద్ వైరాగ్యం – పోటీకి దూరం

ఉమ్మడి కృష్ణా జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నట్లుగా పార్టీ హైకమాండ్ కు తెలిపారు. మైలవరం సీటును మంత్రి జోగి రమేష్ కు కేటాయించారు. వసంత కృష్ణ ప్రసాద్ ను.. జగ్గయ్య పేట నుంచి పోటీ చేయాలని సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దీనికి ఆయన అసంతృప్తికి గురయ్యారు. పార్టీ హైకమాండ్ కు అందుబాటులోకి రాకుండా వెళ్లిపోయారు. తాను పోటీ చేయడానికి సిద్ధంగా లేనని సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది.

మాట్లాడుకుందాం.. సీఎం క్యాంప్ ఆఫీసుకు రావాలని ఆయనకు సమాచారం పంపినా ఆయన పట్టించుకోలేదు. దీంతో ఆయన ను బుజ్జగించేందుకు వైసీపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. మైలవరం నియోజకవర్గంలో వర్గ పోరాటం చాలా కాలంగా ఉంది. వసంత కృష్ణ ప్రసాద్ ను జోగి రరమేష్ వర్గం పదే పదే అవమానిస్తున్నా సీఎం పట్టించుకోలేదు. ఇప్పుడు టిక్కెట్ కే ఎసరు పెట్టారు. మైలవరంలో మొదట జోగి రమేష్ ఇంచార్జ్ గా ఉండేవారు.

గత ఎన్నికలకు ముందు ఆయనను పెడనకు పంపించి.. వసంత కృష్ణప్రసాద్ కు టిక్కెట్ ఇచ్చారు. ఆయన గెలిచారు. కానీ మళ్లీ మైలవరం నంచేపోటీ చేయాలని జోగి రమేష్ కోరుకుంటున్నారు. జగన్ కు ఇష్టం లేని వాళ్లందర్నీ బూతులు తిట్టి ఆయనను రంజింప చేయడంలో జోగి రేమేష్ ముందుంటారు. అందుకే వసంతను పక్కన పెట్టి జోగికే మైలవరం కేటాయించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ల‌వ్ మీ’ ట్రైల‌ర్‌: భ‌యంతో కూడిన ఓ ప్రేమ‌క‌థ‌!

https://youtu.be/BacOcD8e_3k?si=D6mw3GiNjusn8mnE దెయ్యంతో ప్రేమ‌లో ప‌డ‌డం ఓ ర‌కంగా కొత్త పాయింటే. 'ల‌వ్ మీ' క‌థంతా ఈ పాయింట్ చుట్టూనే తిర‌గ‌బోతోంది. ఆశిష్ క‌థానాయ‌కుడిగా న‌టించిన సినిమా ఇది. దిల్ రాజు బ్యాన‌ర్‌లో తెర‌కెక్కించారు. ఈనెల...

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

HOT NEWS

css.php
[X] Close
[X] Close