”వైసీపీ అక్రమాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ పటంలో ఏపీ ఉండదు. సమయం లేదు మిత్రమా.. విజయమా.. వీర్గ స్వర్గమా? తేల్చుకోవాల్సిన పరిస్థితి మనది. రాష్ట్ర భవిష్యత్తు ప్రజల చేతుల్లోనే ఉంది” అని పేర్కొన్నారు ఎమ్మెల్యే, కథానాయకుడు నందమూరి బాలకృష్ణ . టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభ విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా భారీగా జరుగుతోంది.
ఈ సభలో బాలకృష్ణ మాట్లాడారు. వైసీపీ సైకో పాలనలో రాష్ట్రం అన్నీ రంగాల్లో వెనుకబడింది. అయితే డ్రగ్స్ దందాలో మాత్రం రాష్ట్రాన్ని నంబర్ వన్గా నిపిపింది వైసీపీ. ల్యాండ్, శాండ్ స్కాములతో రూ.కోట్లు దోచుకున్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు లేవు. యువతకు ఉపాధి అవకాశాలు లేవు. వైకాపా అక్రమాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ పటంలో ఏపీ ఉండదు. ఇప్పుడింక సమయం లేదు. విజయమా.. వీర్గ స్వర్గమా? తేల్చుకోవాల్సిన పరిస్థితి మనది. వైసీపీ సైకో పాలనకు ప్రజలు సరైన గుణపాఠం చెప్పాలి’ అని పిలుపునిచ్చారు బాలకృష్ణ. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నలుమూల నుంచి టీడీపీ, జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చారు.