రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ – అనర్హతా వేట్లు లేనట్లే !

రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. 15 రాష్ట్రాల్లో ఎప్రిల్‌ నెలాఖరుకు ఖాళీ అయ్యే 56 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 3 స్థానాలు, తెలంగాణలో 3 స్థానాలు ఖాళీ అవబోతున్నాయి. ఫిబ్రవరి 8న నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. ఫిబ్రవరి 15 నామినేషన్ల దాఖలుకు చివరి రోజు .. ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. ఉదయం 9గం.ల నుంచి సాయంత్రం 4గం.ల వరకు పోలింగ్‌ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5గం.ల నుంచి జరగనున్న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం ఏపీలో మూడు సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయి. కానీ టిక్కెట్ల కేటాయింపుల తర్వాత వైసీపీలో గందరగోళం ఏర్పడింది. దీంతో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో టీడీపీ బలాన్ని తగ్గించడానికి గంటా శ్రీనివాస్ రాజీనామా ఆమోదించారు. నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. స్పీకర్ విచారణకు పిలిచారు. అయితే ఇంకా నిర్ణయం తీసుకోక ముందే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పుడు అనర్హతా వేటు వేస్తే చెల్లదు. టీడీపీ అభ్యర్థిని నిలబెడితే మాత్రం పోలింగ్ జరగడం ఖాయం.

తెలంగాణలో ప్రస్తుతం ఉన్న బలాల ప్రకారం ఒకటి బీఆర్ఎస్ పార్టీకి లభించవచ్చు. కానీ అక్కడా ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీలు నిర్వహిస్తున్నారు. మూడు స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల్ని పెడితే.. అక్కడా పోలింగ్ జరుగుతుంది. సాధారణ ఎన్నికలకంటే ముందు తెలుగు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close