ఫిబ్రవరి మొదటి వారంలో చెబుతా : వసంత కృష్ణ ప్రసాద్

వైసీపీకి మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కూడా దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తాను మైలవరంలో పోటీ చేయడంపై తానేమి చెప్పలేనన్నారు. త్వరలో సీఎం స్పష్టత ఇస్తారన్నారు. మైలవరంలో పోటీపై త్వరలో అన్ని విషయాలు తెలియజేస్తానని వచ్చే నెల 4 లేదా 5న ప్రెస్‍మీట్ పెట్టి తన మనోభావాలు తెలియజేస్తానని ప్రకటించారు. అభివృద్ధి విషయానికి వచ్చేసరికి గొంతులో వెలక్కాయ పడ్డట్లు ఉందని.. – సంక్షేమ పథకాల వల్ల అభివృద్ధికి నిధులు లేవన్నారు.

అభివృద్ధి లేదనే జనం మాటలు అబద్ధమని తాను అననని స్పష్టం చేశారు. తినగా తినగా పంచదార చేదు అన్నట్లు సంక్షేమ పథకాల చేదయ్యాయని.. పథకాలు కాదు.. అభివృద్ధి కావాలంటున్నారని వాపోయారు. రెండు రోజు కిందట వైసీపీ క్యాడర్ కు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆయన విమర్శలు చేశారు. అంతకు ముందే ఆయన చాలా రోజుల నుంచి టీడీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. కానీ దేవినేని ఉమతో ఆయనకు రాజకీయ శత్రుత్వం తీవ్రంగా ఉంది.

ఇటీవల మైలవరం లో వసంత కృష్ణ ప్రసాద్ కు టిక్కెట్ నిరాకరించారని ప్రచారం జరిగింది. దీంతో ఆయన అసహనానికి గురై వసంత కృష్ణ ప్రసాద్ కొంత కాలం కనిపించకుండా పోయారు. సీఎంవో పిలిచినా వెళ్లలేదు. చివరికి బుజ్జగించారు. అయితే.. ఇప్పుడు మళ్లీ రివర్స్ లో పోటీ చేస్తానో లేదో చెప్పలేనని.. ఫిబ్రవరి మొదటి వారంలో కీలక ప్రకటన చేస్తానని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close