లోకేష్, చంద్రబాబును తిట్టనందుకే టిక్కెట్ ఇవ్వట్లేదని జగన్ చెప్పారు : మైలవరం ఎమ్మెల్యే

లోకేష్ , చంద్రబాబుని తిట్టవు నిన్నెలా నమ్మాలని జగన్ అడిగారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జగన్ రెడ్డి తీరుపై మండిపడ్డారు. తిట్టనివాళ్లకి ఎమ్మెల్యే , పార్లమెంటు సీట్లు ఇవ్వనని చెప్పారని … మనసు గాయపడినప్పుడు నిలువెత్తు బంగారం ఇస్తామన్నా ఉండలేమని వైసీపీకి రాజీనామా చేస్తున్న అంశంపై పరోక్షంగా స్పందించారు. మైలవరం నియోజకవర్గంలోని పలువురు నాయకులు, ముఖ్యనేతలతో వసంత సోమవారం ఆత్మీయ సమావేశం నిర్విహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకి స్వస్తిపలికి వ్యాపారాలు చేసుకుందాం అనుకున్నానన్నారు. అయితే శ్రేయోభిలాషులు రాజకీయాల్లోనే ఉండమన్నారని చెప్పుకొచ్చారు.

2014లో ఓడిపోయిన, 2019లో నన్ను గెలిపించని జోగిరమేష్‌ను నేను గెలిపించాలట అని పార్టీ హైకమాండ్ సూచనలపై మండిపడ్డారు. పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వమంటే ఇవ్వడంలేదన్నారు. ఎన్ని సార్లు చెప్పిన అరణ్య రోదనే అయిందన్నారు. కృష్ణా, గుంటూరులో 33 నియోజకవర్గాల్లో దాదాపు అన్ని వైసీపీ గెలిస్తే.. రాజధాని మార్పుపై ఇక్కడ ప్రజలకు సమాధానం ఎలా చెప్పాలిని రాజధాని నిర్ణయం తీవ్ర నష్టం తెస్తుందని అప్పుడే చెప్పానని వసంత కృష్ణ ప్రసాద్ సమావేశంలో చెప్పారు. రాజధాని మార్పు సరి కాదని తాను, మల్లాది విష్ణు చెప్పామన్నారు. కొడాలి నాని సీఎం నిర్ణయం ఫైనల్.. ఆయన నిర్ణయానికి ఎదురు చెప్పకూడదని వారించారని కృష్ణ ప్రసాద్ తెలిపారు.

అంబటి లేచి ఆయన నివాసంలో ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి ఉండకూడదని హెచ్చరించారన్నారు. వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆయన కొడాలి నాని తరహాలో ఎన్టీఆర్ తో పాటు వైఎస్ఆర్ బొమ్మతో ప్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close