మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న

దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను గాడిన పెట్టి, ఎన్నో అవంత‌రాల‌ను ఎదుర్కొంటూ దేశాన్ని ప్ర‌పంచం ముందు సొంత కాళ్ల‌పై నిల‌బెట్టిన మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర్సింహ‌రావుకు గొప్ప గౌర‌వం ద‌క్కింది. మాజీ ప్ర‌ధాని పీవీకి కేంద్ర ప్ర‌భుత్వం దేశ అత్యున్న‌త పుర‌స్కారం అయిన భార‌త ర‌త్న పుర‌స్కారం ప్ర‌క‌టించింది.

భార‌త ర‌త్న పొందిన తొలి తెలుగు వ్య‌క్తిగా పీవీకి గౌర‌వం ద‌క్క‌గా… పీవీ న‌ర్సింహ‌రావు తెలంగాణ‌లోని ఉమ్మ‌డి వ‌రంగల్ జిల్లాకు చెందిన న‌ర్సంపేటలో జ‌న్మించారు. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని నంధ్యాల ఎంపీగా గెలిచి ప్ర‌ధాని అయ్యారు పీవీ.

పీవీ న‌ర్సింహ‌రావు ఏపీ నుండే కాదు మ‌హారాష్ట్రలోని రామ్ టెక్ లోక్ స‌భ స్థానం నుండి వ‌రుస‌గా రెండుసార్లు గెలుపొంద‌గా, ఒడిశాలోని బ్ర‌హ్మ‌పుర్ స్థానం నుండి కూడా లోక్ స‌భ‌కు గెలుపొంద‌టం విశేషం.

మైనారిటీ ప్ర‌భుత్వాన్ని కేంద్రంలో స‌క్సెస్ ఫుల్ గా న‌డిపిన పీవీ… దేశంలోని అన్ని భాష‌ల్లోనూ ఆయ‌న‌కు ప్రావీణ్యం ఉండ‌టం విశేషం. దాదాపు 17 భార‌తీయ భాష‌ల‌తో పాటు ఇత‌ర దేశాల భాష‌ల్లోనూ ఆయ‌న అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల స‌త్తా ఉన్న వ్య‌క్తి.

అప్ప‌టి వాజ్ పేయి ప్ర‌భుత్వం 1998లో నిర్వ‌హించిన న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌లు 1996లోనే చేయాల్సింది. అప్ప‌టి ప్ర‌ధానిగా పీవీ ప్ర‌త్యేక దృష్టి పెట్టి స‌హ‌య స‌హ‌కారాలు అందించ‌గా, 1996 ఎన్నిక‌ల్లో ప్ర‌భుత్వం మారిపోవ‌టంతో న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌లు వాయిదా ప‌డ్డాయి. దీంతో పీవీ… అప్ప‌టి ప్ర‌ధాని వాజ్ పేయి తో మాట్లాడి, న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌లు జ‌ర‌గ‌టంలో చొర‌వ చూపార‌ని అప్ప‌ట్లో ద‌గ్గ‌ర చూసిన వారు అంటుంటారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close