ఇంతకీ ప్రధానితో జగన్ చర్చించిందేంటి ?

జగన్ రెడ్డి ఢిల్లీ వెళ్లనూ వెళ్లారు.. రానూ వచ్చారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీతో సమావేశం అయ్యారు. అలాగే నిర్మలా సీతారామన్ తోనూ సమావేశం అయ్యారు. భేటీ ముగిసిన తర్వాత సీఎంవో పీఆర్వో వర్గాలు ఎప్పుడూ చెప్పే పడికట్టు పదాలు అయిన.. పోలవరం నిధులు.. కరెంట్ బకాయిలు అంటూ పాత మ్యాటర్ అంతా.. మళ్లీ అడిగారని చెప్పుకొచ్చారు. నిజానికి ఆయన ప్రధానితో ఈ విషయాల్లో ఒక్కటి కూడా ఆయన మాట్లాడి ఉండరని అందిరికీ తెలుసు.

మరి లోపం ఏం మాట్లాడారు ? ఖచ్చితంగా ఏపీ రాజకీయాలే మాట్లాడి ఉంటారని చెప్పాల్సిన పనిలేదు. టీడీపీ, జనసేన కూటమి వైపు వెళ్లవద్దని.. తనకు పాతిక సీట్లు వస్తాయని.. తానే నమ్మకమైన మిత్రపక్షమని ఆయన చెప్పేందుకు ప్రయత్నించి ఉంటారని భావిస్తున్నారు. అయితే ప్రధాని మోదీ స్పందన ఏమిటన్నదానిపై మాత్రం ఎవరికీ తెలియదు. నిర్మలా సీతారామన్ తో మాట్లాడి.. వచ్చే ఏడాది అప్పులు కూడా ఇప్పుడే తీసుకునే చాన్స్ గురించి మాట్లాడినట్లుగా తెలుస్తోంది ఎన్నికలకు ముందు పెండింగ్ పెట్టిన బటన్లు నొక్కాలంటే డబ్బులు కావాలి.. వాటి కోసం అప్పులు వెదుక్కుంటున్నారు.

అమిత్ షాతో భేటీ అయ్యేందుకు జగన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ అపాయింట్ మెంట్ దొరకలేదు. షాతో భేటీ కోసమే ఒక రోజు ముదుగా ఆయన ఢిల్లీ వచ్చారని అంటున్నారు. కానీ షా తో భేటీ దొరకలేదు. పార్లమెంట్ లోనూ కలవలేకపోయినట్లుగా తెలుస్తోంది. ఈ అసహనంతోనే ఆయన వెనుదిరిగారని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ట్రంప్‌కు అంత ఈజీ కాదు !

అమెరికా అధ్యక్ష రేసులో ముందున్నానని ఆశల్లో తేలిపోతున్న డొనాల్డ్ ట్రంప్‌కు గడ్డు పరిస్థితి ఎదురొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. డెమెక్రాట్ల అభ్యర్థిగా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ ఖరారు కావడంతో...

హైదరాబాద్ టు బెంగళూరు ఆరు లైన్ల హైవే !

హైదరాబాద్ - విజయవాడ మార్గం తర్వాత అత్యంత బిజీగా ఉండే మార్గం హైదరాబాద్ - బెంగళూరు. ఈ మార్గాన్ని ఆరు లైన్లుగా మార్చాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌ -...

అమరావతిలో AI హబ్ !

అమరావతిని కొనసాగించి ఉంటే ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ హబ్‌గా మారి ఉండేదని సీఎం చంద్రబాబునాయుడు అసెంబ్లీలో బాధగా చెప్పారు. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది..ఎందుకు ఉపయోగించుకోకూడదని నారా లోకేష్ ప్రయత్నిస్తున్నారు. ప్రసిద్ది...

LRS అమలుతో తెలంగాణ రియల్ ఎస్టేట్‌కు ఊపు !

తెలంగాణలో లే అవుట్‌ రెగ్యులరైజేషన్‌ స్కీమ్‌(LRS)‌ను అమల్లోకి తీసుకురావాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు క్లియర్‌ అవ్వని LRS సమస్యలను.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా పరిష్కరించాలని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close