చేతకాక, చేవచచ్చి : హైదరాబాదే ఉమ్మడి రాజధానిగా కొనసాగాలంటున్న వైసీపీ !

వైసీపీ నేతలు పూర్తిగా సిగ్గూ ఎగ్గూ వదిలేస్తున్నారు. ప్రజలు ఐదేళ్లు పరిపాలించమని చేతికి ఇస్తే.. మొత్తం సర్వనాశనం చేసేసి మళ్లీ మొదటికి పోదామని పత్తిత్తు కబుర్లు ప్రారంభించారు. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీలో పెత్తనాలు చేసే రెడ్డి నేతలు కొత్త వాదన అందుకున్నారు. తాను ఈ విషయాన్ని రాజ్యసభలో మాట్లాడుతానంటూ..ఇంకా రాజ్యసభకు ఎన్నిక కాక ముందే సుబ్బారెడ్డి మాట్లాడేస్తున్నారు. అలా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ అయితే మంచిదేనని పెద్దిరెడ్డి కూడా స్వరం కలిపారు.

నిజానికి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే సంగతిని చాలా మంది మర్చిపోయారు. టీడీపీ హయాంలో అమరావతిని రాజధానిగా నిర్ణయించి అక్కడకు తరలించినా..హైదరాబాద్ లో తమ హక్కు మేరకు ఉన్న భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించేవారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే.. ఏపీ ప్రభుత్వానికి సెక్రటేరియట్ లో ఉన్న భవనాలను తెలంగాణ సర్కార్ కు అప్పగించారు. కేసీఆర్ వెంటనే వాటిని కూలగొట్టి పెద్ద సెక్రటేరియట్ నిర్మించుకున్నారు. ప్రస్తుతం ఏపీకి సంబంధించి ఏ ఒక్క కార్యాలయం కూడా తెలంగాణ నుంచి నడవడం లేదు. చివరికి ఉమ్మడి రాజధాని అయినప్పటికీ కరోనా సమయంలో పేషంట్లు ఏపీ నుంచి హైదరాబాద్ వస్తూంటే..తెలంగాణ పోలీసులు ఆపారు.

అప్పుడు కూడా ప్రభుత్వం పెద్దగా స్పందించలేదు. వివిధ అంశాల్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని గుర్తు చేయాల్సి వచ్చినప్పుడల్లా సీఎం జగన్ సర్కార్ మౌనంగానే ఉంది. చేతిలో ఉన్న అమరావతిని నిర్వీర్యం చేసిన చేతకాని తనానికి.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటూ చేసిన దోపిడీకి మధ్య చివరికి చేవచ్చిన వైసీపీ రాజకీయం ఉమ్మడి రాజధాని హైదరాబాద్ దగ్గరకు వస్తోంది. ఉమ్మడి రాజధాని అయినా కాకపోయినా ప్రజల అవకాశాల్లో ఏ మాత్రం తేడా లేదు.

విభజన చట్టం ప్రకారం పదేళ్లే ఉమ్మడి రాజధాని.. ఆ తర్వాత ఆ పేరు కూడా ఉండదు. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలంటే.. విభజన చట్టంలో మార్పులు చేయాలి. అది సాధ్యం కాదు. కానీ తమ చేతకాని తనాన్ని రాజకీయంగా మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఇప్ుపడు వైసీపీ నేతలు అదే చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

‘కృష్ణ‌మ్మ’ రివ్యూ: కొన్ని అల‌లు… ఇంకొన్ని సుడిగుండాలు

Krishnamma Movie Review తెలుగు360 రేటింగ్: 2.75/5 కొన్ని క‌థ‌ల్ని మ‌ల‌యాళ, త‌మిళ ద‌ర్శ‌కుడు డీల్ చేసే విధానం భ‌లే బాగుంటుంది. వాస్త‌విక‌త‌కు అద్దం ప‌ట్టేలా స‌న్నివేశాల్ని తెర‌కెక్కిస్తారు. ఆయా క‌థ‌ల్లో జీవం ఉట్టిప‌డుతుంటుంది. సినిమాటిక్...

ద‌ర్శ‌కురాలిగా ఆర్.జే!

ఆర్జే.. (రేడియో జాకీ)ల‌కూ టాలీవుడ్ కు గట్టి అనుబంధ‌మే ఉంది. కొంత‌మంది ఆర్‌.జేలు న‌టుల‌య్యారు. ఇంకొంత‌మంది డ‌బ్బింగ్ ఆర్టిస్టులుగా మారారు. కొంద‌రు హీరోలుగానూ మారారు. ఇప్పుడు ఓ ఆర్‌.జే మెగాఫోన్ ప‌ట్ట‌బోతోంది. త‌నే.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close