చంద్రబాబు నివాసంలో రాజశ్యామల యాగం

టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో మూడు రోజుల పాటు రాజశ్యామల యాగం జరగనుంది. యాభై మంది రుత్విక్కుల ఆధ్వర్యంలో శుక్రవారం యాగం ప్రారంభమయింది. తొలి రోజు చంద్రబాబు దంపతులు యాగక్రతవులో పాల్గొన్నారు. గత డిసెంబర్ లోనూచంద్రబాబు నివాసంలో యాగం జరిగింది. అప్పుడు చండీయాగం, సుదర్శన నారసింహ హోమం నిర్వహించారు. ప్రజలందరికీ మేలు జరగాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సంద ర్భంగా చంద్రబాబు-భువనేశ్వరి హోమాలు నిర్వహించారు.

గుంటూరుకు చెందిన వేద పండితులు శ్రీనివాసాచార్యుల వారి పర్యవేక్షణలో రిత్వికులు యాగం నిర్వహిస్తున్నారు. రాజకీయ నాయకులు ఎన్నికలకు ముందు యాగాలు నిర్వహించడం కామన్ గా వస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ లోని తన నివాసంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. ఇక కేసీఆర్ ఎన్నికలతో పాటు ఏ ముఖ్యమైన పని చేయాలనుకున్నా యాగం నిర్వహిస్తారు. ఎన్నికలకు ముందు పామ్ హౌస్ లో శారదాపీఠాధి సమక్షంలో రాజశ్యామల యాగం నిర్వహించారు. కానీ ఆయన యాగం ఫలితాన్నివ్వలేదని.. ఎన్నికల ఫలితాలను బట్టి అర్థమవుతుంది. స్వరూపానంద కేవలం కేసీఆర్ కు మాత్రమే కాదు ఏపీ సీఎం జగన్ కు కూడా హోమాలు నిర్వహిస్తూ ఉంటారు.

2019 ఎన్నికలకు ముందు జగన్ కోసం దాదాపుగా ఏడాది పాటు ఓ ప్రదేశంలో యాగం చేశారు. జగన్ కూడా ఆ యాగానికి వెళ్లారు. తర్వాత కూడా చేశారని చెబుతున్నారు. ఈ సారి జగన్ కోసం రాజశ్యామల యాగాలు స్వరూపానంద చేస్తున్నారో లేదో స్పష్టత లేదు.. కానీ చంద్రబాబు దంపతులు మాత్రం.. రాజశ్యామల యాగం పూర్తి చేసేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంద్రానికి నిప్పెట్టిన దేవర

https://youtu.be/CKpbdCciELk?si=XoyRoPJZB05oVwwN ఎప్పుడెప్పుడా అని ఎన్టీఆర్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన ‘దేవర’ ఫియర్ సాంగ్‌ వచ్చేసింది. రేపు (మే 20).. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీమ్‌ తొలి పాటను విడుదల చేసింది. పేరుగా తగ్గట్టుగానే టెర్రిఫిక్...

చోరుడు రివ్యూ : అడవి దొంగ పాయింట్ బావుంది కానీ…

స్టార్ కంపోజర్ గా కొనసాగుతూనే మరోవైపు నటునలో కూడా బిజీగా వున్నారు జీవి ప్రకాష్ కుమార్. ఇటీవల ఆయన నుంచి వ‌చ్చిన‌ 'డియర్' సినిమా నిరాశపరిచింది. ఇప్పుడు ఆయన టైటిల్ రోల్ చేసిన...

అమెరికాలో వల్లభనేని వంశీ

గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అమెరికా వెళ్లారు. పోలింగ్ అయిపోయిన తర్వాత చాలా మంది వెళ్లారు కానీ.. అందరూ తిరిగి వస్తారు.. కానీ వంశీ వస్తారా లేదా అన్నది మాత్రం...

ఫాక్స్ లింక్ పరిశ్రమ తిరుపతి నుంచి చెన్నైకి జంప్ !

యాపిల్‌కు విడిభాగాలు తయారు చేసి సప్లయ్ చేసే ఫాక్స్ లింక్స్ కంపెనీ ఏపీ నుంచి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోయింది. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నారా లోకేష్ ఈ పరిశ్రమను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close