పంతం నెగ్గించుకున్న గంటా – భీమిలీకే ఖరారు !

గంటా శ్రీనివాసరావు తన పంతం నెగ్గించుకున్నారు. ఆయన పోటీ భీమిలీ నుంచే అని చంద్రబాబు దాదాపుగా ఖరారు చేశారు. చీపురుపల్లి నుంచి ఆయనను బొత్సపై పోటీ చేయించాలని చంద్రబాబు భావించారు. ఈ మేరకు సర్వేలు చేయించారు. అయితే గంటాకు మాత్రం ఇష్టం లే్దు. అక్కడ్నుంచి పోటీ చేయడం వల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని చంద్రబాబు చెప్పినా .. విశాఖ జిల్లా దాటిపోలేనని ఆయన భీష్మించుకు కూర్చున్నారు.

ఓ దశలో సొంతంగా సర్వేలు చేయించుకుని వెళ్లడానికి సిద్ధమయ్యారు. కానీ తర్వాత పరిస్థితులు ఆయనకు అనుకూలంగా మారాయి. బీజేపీకి శ్రీకాకుళం కాకుండా ఎచ్చెర్ల కేటాయించాలనుకోవడంతో.. అక్కడ ఉన్న కళా వెంకట్రావును.. చీపురుపల్లికి పంపాలని అనుకుంటున్నారు. ఈ కారణంగా గంటా శ్రీనివాసరావుకు భీమలీనే ఫైనల్ చేస్తారని తెలుస్తోంది. టిక్కెట్ ఖరారు చేసేందుకు నిర్వహించే ఐవీఆర్ఎస్ పోల్ ను కూడా భీమిలీలో నిర్వహించారు. ఇక అధికారిక ప్రకటనే మిగిలిందని తెలుస్తోంది.

కొంత మంది సీనియర్లకు ఈ సారి టిక్కెట్లు దక్కడం లేదు. ఆ జాబితాలో గంటా లేకపోవడం.. తాను అనుకున్న సీటే్ రావడం గంటా అదృష్టం అనుకోవచ్చు. గతంలో ఓ సారి భీమలీ నుంచి గంటా గెలిచారు. అక్కడైతే ఆయన సులువుగా గెలుస్తారన్న అభిప్రాయం ఉంది. ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న విశాఖ ఉత్తరంను ఇప్పటికే బీజేపీకి కేటాయించారు. అక్కడ్నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తెలంగాణ అంటే కాంగ్రెస్ – బీఆర్ఎస్ కాదు !

తెలంగాణ తెచ్చింది తామేనని .. తమ నాయకుడు కేసీఆర్ తెలంగాణ బాపు అని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేసుకుంటూ వచ్చారు కానీ.. ఇప్పుడు పరిస్థితి తిరగబడింది. తెలంగాణపై వారి ముద్ర లేకుండా ...

కేసీఆర్ కు అన్నీ తెలుసు… ఢిల్లీ లిక్క‌ర్ కేసులో సంచ‌ల‌నం!

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న ఢిల్లీ లిక్క‌ర్ కేసు బిగ్ ట‌ర్న్ తీసుకునేలా క‌న‌ప‌డుతోంది. ఇప్ప‌టికే ఈ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలుపాలు కాగా... మాజీ సీఎం కేసీఆర్ కు ఈ స్కాం...

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లోకి కేసీఆర్‌ను లాక్కొచ్చిన ఈడీ

కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏదీ కలసి రావడం లేదు. తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ పేరును ఈడీ తొలి సారిగా ప్రస్తావించింది. లిక్కర్ స్కాం గురించి కవిత ముందే కేసీఆర్‌కు చెప్పిందని.. గోపికుమరన్...

ఈవారం బాక్సాఫీస్‌: మూడు సినిమాల ముచ్చ‌ట‌

ఐపీఎల్ హంగామా అవ్వ‌గానే టాలీవుడ్ కి మూడ్ వ‌చ్చింది. వ‌రుస‌గా సినిమాల్ని రంగంలోకి దింపే ప‌నిలో ప‌డింది. ఈ వారం ముచ్చ‌ట‌గా మూడు సినిమాలు ప్రేక్ష‌కుల్ని అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యాయి. విశ్వ‌క్‌సేన్ 'గ్యాంగ్స్ ఆఫ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close