తమిళనాడులో బీజేపీకి మద్దతుగా లోకేష్ ప్రచారం !

తమిళనాడు ప్రజల్లో తెలుగు మూలాలున్న వారు 40 శాతం మంది ఉంటారని అంచనా. డీఎంకే ఫ్యామిలీ కూడా తెలుగు వారేనని చెబుతారు . ఎంత మంది ఉంటారన్న సంగతిని పక్కన పెడితే.. ఇప్పటికీ తెలుగు మాట్లాడుతూ .. తెలుగు సంప్రదాయాల్ని పాటించే వారు లక్షల్లో ఉంటారు. వీరి మద్దతు కోసం రాజకీయ పార్టీలు తెలుగుకు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాయి.

తమిళనాడులో కొన్ని సీట్లు అయినా సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ .. తెలుగు ఓటర్ల కోసం … టీడీపీ నాయకుల్ని ప్రచారానికి ఆహ్వానిస్తోంది. కోయంబత్తూరు నుంచి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై పోటీ చేస్తున్నారు. అక్కడ తెలుగు వ్యాపారులు.. ఇతర వర్గాలు పెద్ద ఎత్తున ఉన్నారు. వారందర్నీ ఓట్లు అడిగేందుకు నారా లోకేష్‌ను అహ్వానించారు. ఆయన గురువారం పర్యటించి.. ప్రచారం చేయనున్నారు.

చంద్రబాబునాయుడు అరెస్ట్ తర్వాత .. నారా లోకేష్ కు జాతీయస్థాయి కవరేజీ లభించింది. ఆర్నాబ్ తో ఆయన ఇంటర్యూ.. బ్రింగ్ ఇట్ ఆన్ అంటూ చేసిన సవాల్ వైరల్ అయింది. జాతీయ మీడియా ఇంటర్యూల్లో సూటిగా, స్పష్టంగా బెరుకులేకుండా ఇచ్చిన సమాధానాలతో ఆయన ఇతర రాష్ట్రాలకూ పరిచయమయ్యారు. ఈ కారణంగా పొత్తుల్లో భాగంగా ఇతర రాష్ట్రాల్లోనూ తమకు ప్రచారం చేయాలని బీజేపీ కోరుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close