చిన్నమ్మకు ప్రమోషనొస్తే తెదేపాకు తిట్లు పెరుగుతాయ్‌!

రాష్ట్ర భాజపా నాయకులలో తెలుగుదేశాన్ని ఎడాపెడా తిట్టిపోస్తూ చంద్రబాబునాయుడుకు తరచూ చికాకు పుట్టించే వారిలో ప్రధానంగా దగ్గుబాటి పురందేశ్వరి పేరును కూడా చెప్పుకోవాలి. కాంగ్రెస్‌ పార్టీలో కేంద్రమంత్రిగా పనిచేసి, రాష్ట్ర విభజనకు సంబంధించిన ప్రక్రియ జరుగుతున్న సమయంలో.. సమైక్య వాదానికి తనకు చేతనైనంత ద్రోహం చేసి… పార్టీ పతనం ఖరారు అయిన తర్వాత.. భాజపాలోకి ఫిరాయించి.. మళ్లీ అధికార పార్టీ నాయకురాలిగా చెల్లుబాటు అవుతున్న ఆమెను అందరూ చిన్నమ్మ అని పిలుచుకుంటూ ఉంటారు. సదరు చిన్నమ్మ ఇప్పుడు భాజపాలోనే పార్టీ పదవుల పరంగా ప్రమోషన్‌ పొందే అవకాశం కనిపిస్తోంది.

రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయడం లేదు అని నిందించడంలోనూ, కేంద్రం వల్లమాలిన సాయం చేసేస్తున్నప్పటికీ.. చంద్రబాబునాయుడు ప్రభుత్వం దాన్ని మొత్తం తినేస్తున్నదని ఆరోపణలు గుప్పించడంలోనూ చిన్నమ్మ ఎప్పుడూ చాలా ముందుంటారు. భాజపాకు తెలుగుదేశం మిత్రపక్షమే కావొచ్చు గాక.. కానీ రాష్ట్రంలో భాజపా కూడా బలపడాలంటే. .తెదేపాను తిట్టిపోయడం మాత్రమే మార్గం అని భావించే నాయకురాళ్లలో ఆమె ఒకరు. అలాంటి పురందేశ్వరిని ఇప్పుడు జాతీయ భారతీయ మహిళా మోర్చా సారధిని చేయడానికి పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
పురందేశ్వరికి భాజపా జాతీయ మహిళా మోర్చా పదవి దక్కినట్లయితే కీలకమైన ప్రమోషన్‌ ఇచ్చినట్లే లెక్క. సాధారణంగా గత పనితీరును బట్టే ప్రమోషన్‌ ఇచ్చారని ఎవరైనా భావిస్తారు గనుక.. గత పనితీరు అంతా తెదేపాను తిట్టడం తప్ప ఆమె చేసిందేమీ లేదు గనుక.. భవిష్యత్తులో మరింత దూకుడు ప్రదర్శిస్తుందనడంలో సందేహం లేదు. రాష్ట్ర పదవులు చేతిలో ఉంటేనే.. చిన్నమ్మ పురందేశ్వరి చెలరేగిపోతూ ఉన్నారు. మరి జాతీయ పదవి కూడా వచ్చిందంటే.. ఇక చంద్రబాబు మీద తన మాటల దాడులను మరింతగా పెంచేస్తారనడంలో సందేహం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close