డమ్మీ పోలీస్ : అసలు రాయి కూడా దొరకలేదా !?

ఏపీలో పోలీసు వ్యవస్థ ఎలా అయిపోయిందంటే.. సీఎంపై రాయి పడిందంటే.. . ఆ రాయిని కూడా స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచన లేనంత మైండ్ మొద్దుబారిపోయిన పరిస్థితుల్లో ఉన్నారు. అరచేతిలో ఇమిడిపోయేంత రాయితే కింద నుంచి ఎవరో విసిరితే.. జగన్ రెడ్డి తలకు తగిలి బౌన్స్ అయి.. వెల్లంపల్లి కంటికి తగిలి కింద పడింది. అది ఎక్కడో పడదు… తగిలిన వారి దగ్గరే పడుతుంది. బస్సు మీదనే పడుతుంది. కానీ ఆ రాయిని ఎవరూ గుర్తించలేదు. ఎవరూ స్వాధీనం చేసుకోలేదు. కేసులో మొదటి సాక్ష్యం అదే అవుతుంది.

పద్నాలుగు వందల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని విజయవాడ సీపీ చెప్పారు. అంత మంది ఉంటే.. కనీసం దాడి చేసిన రాయిని కూడా ఎందుకు స్వాధీనం చేసుకోలేదు.. ఇప్పుడు ప్రెస్ మీట్లలో అరచేయి అంత రాయి అని ఊహాగానాలతో చెప్పడం ఎందుకు ?. దాడి జరిగినప్పుడు … పద్నాలుగు వందల మంది పోలీసులు ఉంటే… ఆ సరౌండింగ్స్ మొత్తాన్ని బ్లాక్ చేసి ఉంటే.. నిందితుడు అక్కడే ఉండేవాడు కదా.. పట్టుకోవడం ఎంత సేపు ?

ఎలా చూసినా పోలీసులు రక్షణ పరంగానే కాదు.. దాడి తర్వాత వ్యవహరించిన విధానంపైనా అనేక అనుమానాలు ఉన్నాయి. అసలు రాయి దాడి జరగకుండా డ్రామా అయినా ఆడి ఉండాలి.. లేకపోతే పోలీసుల సాయంతోనే ఈ డ్రామాను రక్తి కట్టించి ఉండాలి… అందుకే పవన్ కల్యాణ్ ఇలాంటి పోలీసులతో ఎలా దర్యాప్తు చేయిస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు.ప్రజల డౌట్ కూడా అదే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

అదే జరిగితే సజ్జల పరిస్థితి ఏంటి..?

వైసీపీలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తుండటంతో జగన్ రెడ్డి ఆత్మగా చెప్పుకునే సజ్జల రామకృష్ణ పరిస్థితి ఏంటనేది బిగ్ డిబేట్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నాన్నాళ్ళు తనే సీఎం అనే తరహాలో...

థియేట‌ర్లు క్లోజ్.. హీరోల షేర్ ఎంత‌?

తెలంగాణలో సింగిల్ స్క్రీన్స్ మూత‌ప‌డ‌డంతో టాలీవుడ్ ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డింది. నిజానికి ఇలాంటి ప‌రిస్థితి ఎప్పుడో ఒక‌ప్పుడు వ‌స్తుంద‌న్న భ‌యం, ఆందోళ‌న అంద‌రిలోనూ ఉంది. అది ఒక్క‌సారిగా నిజ‌మ‌య్యేస‌రికి అవాక్క‌య్యారు. నిజానికి నెల రోజుల...

ఐ ప్యాక్ బృందానికి జగన్ రెడ్డి వీడ్కోలు..?

ఏపీ ఎన్నికల్లో అధికార వైసీపీకి సేవలందించిన ఐ ప్యాక్ కార్యాలయానికి జగన్ రెడ్డి ఎన్నికలు ముగిసిన రెండు రోజుల తర్వాత వెళ్తుండటం చర్చనీయాంశం అవుతోంది. వాస్తవానికి పోలింగ్ ముగిసిన తర్వాత ఐ ప్యాక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close