డబ్బుతో కొడుతున్నారు : లాజిక్ మిస్సవుతున్న వైసీపీ !

డబ్బుతో ఏమైనా చేయవచ్చా ?. ఏమీ చేయలేరని చాలా ఘటనలులు నిరూపించాయి. చివరికి ఎన్నికల్లో కూడా గెలవలేరని.. డబ్బులు విచ్చలవిడిగా పంచినా.. బీఆర్ఎస్ ఓటమి నిరూపించింది. అయినా వైసీపీ తమ చివరి ప్రయత్నంగా డబ్బులనే నమ్ముకుంటోంది. చిన్న స్థాయి నేతల దగ్గర్నుంచి .. నియోజకవర్గ ఇంచార్జుల వరకు ఎంత కావాలంటే అంత ఇచ్చి పార్టీలో చేర్చుకుంటోంది. సోషల్ మీడియా ఖాతాల్లో నెగెటివ్ ప్రచారం చేసే వాళ్లుంటే వెంటపడి డబ్బులిచ్చి పాజిటివ్ గా ప్రచారం చేయమని కోరుతున్నారు.

వైసీపీ నుంచి ద్వితీయశ్రేణి నేతల వలస వెల్లువలా ఉంది. వైసీపీలోనూ చేరికలు ఉన్నాయని చెప్పుకోవడానికి నేతల్ని కొనుక్కుటున్నారు. విజయవాడ నుంచి ఓ నేతను చేర్చుకోవడానికి ఐదు కోట్లు ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చేరిన ప్రతీ నేతకు ఓ ప్యాకేజీ ఇచ్చారు. కానీ వారెవరూ … జగన్ కు కానీ.. వైసీపీకి కానీ ఓటు వేయరు.. వేయించరన్న సంగతిని గుర్తించడానికి సిద్ధంగా లేరు. స్వతహాగా అభిమానం లేని వారు ఓట్లు కూడా వేయరు.

చేరికల విషయంలోనే కాదు.. తమ గురించి వ్యతిరేకంగా ప్రచారం జరగకుండా వైసీపీ నేతలు పూర్తిగా డబ్బునే నమ్ముకున్నారు. వ్యతిరేక వార్తలు రాకుండా డబ్బులతో వల వేస్తున్నారు. ప్రధాన టీవీ చానళ్లను.. యూట్యూబ్ చానళ్ల స్థాయికి దిగజార్చి.. తాము మాత్రమే కనిపించేలా.. ఇంకెవరూ కనిపించకుండా చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న సోషల్ మీడియా ఖాతాలైనా గురి పెట్టి .. డబ్బుల పండగ చేస్తున్నారు. వీరంతా జగన్ భజన చేయవచ్చేమో కానీ.. ప్రజాభిప్రాయాన్ని మార్చలేరని వైసీపీ ఎందుకు నమ్మేలేకపోతోంతో…గత అనుభవాలు బాగా తెలిసిన వైసీపీ నేతలు గింజుకుంటున్నారు.

అనేక మీడియా చానళ్లకు తప్పుడు సర్వేలు వేయమని డబ్బులు ఆశ చూపుతున్నారు. వేసే వారు వేస్తారు.. కానీ ప్రజాభిప్రాయం ఆ సర్వేలకే మారదని.. వైసీపీ పెద్దలు ఎందుకు గుర్తించలేకపోతున్నారో కానీ.. అడ్డగోలుగా సంపాదించిన డబ్బును మాత్రం విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఈ డబ్బులన్నీ ప్రజలకు మెరుగైన సేవ చేయడానికి ఉపయోగించి ఉంటే.. ఎంతో కొంత ప్రజాదరణ కనిపించి ఉండేది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close