గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్… విద్యార్ధి మృతి..!!

భువనగిరి ప్రభుత్వ గురుకుల హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనలో విషాదం నెలకొంది. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఐదు రోజులుగా చికిత్స పొందుతోన్న ఓ విద్యార్ధి మృతి చెందాడు. ఈ నెల 12న భువనగిరి హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ఘటన చోటుచేసుకుంది. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో భాగంగా పులిహోర తిన్న ప్రశాంత్ అనే విద్యార్ధితోపాటు 24మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి తరలించగా అందులో ప్రశాంత్ అనే విద్యార్ధి ఆరోగ్య పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు.

పోస్ట్ మార్టం నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రి నుంచి ప్రశాంత్ మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించగా అక్కడ విద్యార్ధి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. హాస్టల్ సిబ్బంది నిర్లక్ష్యమే తమ కుమారుడి మరణానికి కారణమని ఆరోపిస్తున్నారు. హాస్టల్ సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనలకు కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ సంఘీభావం తెలిపారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు.

మరోవైపు ప్రశాంత్ స్వగ్రామమైన పోచంపల్లి మండలం జిబ్‌లక్‌పల్లిలో విషాదఛాయలు నెలకొన్నాయి. కుమారుడి మృతితో తల్లిదండ్రులు దుఃఖసాగరంలో మునిగిపోయారు.కాగా, గురుకుల వసతి గృహాలలో విద్యార్థినిల ఆత్మహత్యల ఘటనలపై తీవ్ర దుమారం రేగుతుండగా… తాజాగా ఫుడ్ పాయిజన్ ఘటనలో విద్యార్ధి మృతి చెందటంతో హాస్టల్ సిబ్బందిపై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

125 సీట్లు వచ్చినా కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ !?

బీజేపీ 250 సీట్లు సాధించినా కాంగ్రెస్ పార్టీ 125 సీట్లు సాధించినా ఒకటేనని.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. అలా ఎలా సాధ్యమంటే.. కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలు మద్దతిస్తాయి...

సెఫాలజిస్టులందరి మాట టీడీపీ కూటమే !

దేశంలో అగ్రశ్రేణి సెఫాలజిస్టులు అందరూ ఏపీలో టీడీపీ కూటమే గెలుస్తుందని విశ్లేషిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ఎప్పటి నుంచో తన వాదన వినిపిస్తున్నారు. ఏపీలో విస్తృతంగా పర్యటించి ఇంటర్యూలు చేసి వెళ్లిన ...

కూటమిదే విజయమని వైసీపీ అభ్యర్థుల బెట్టింగులు..!!

స్వయంగా జగన్ రెడ్డి గతంలో కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని ప్రకటించినా వైసీపీలో ఆ ధీమా ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పటికే బెట్టింగ్ రాయుళ్లు కూటమిదే అధికారమని లక్షల్లో బెట్టింగ్ కాస్తుండగా...వైసీపీ తరఫున...

ఓట్లు ఎలా వస్తాయో అలానే మోదీ ప్రచారం !

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలి కాలంలో మతప రమైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ముస్లింలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ వస్తే రామ మందిరాన్ని బుల్డోజర్లతో కూల్చేస్తుందని ప్రచారం చేస్తున్నారు. మోదీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close