సజ్జలకూ కోడ్ వర్తిస్తుంది – రాజీనామా తప్పదా ?

కార్యనిర్వాహక ఉత్తర్వులతో నియమితులై క్యాబినెట్ మంత్రి హోదాలో ఉంటూ రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుండి జీత భత్యాలు పొందుతున్న దాదాపు 40 మంది ప్రభుత్వ సలహాదారులకు ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది స్పష్టం చేస్తూ భారత ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశాలు జారీచేసింది.

ప్రభుత్వ సలహాదారుల ప్రవర్తనకు సంబంధించి కమిషన్కు అనేక ఫిర్యాదులు అందాయని, నిర్దేశిత పనికి బదులుగా, వారు రాజకీయ ప్రచారం/రంగంలోకి ప్రవేశిస్తున్నారని మరియు ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ విలేకరుల సమావేశాలను కూడా నిర్వహిస్తున్నారని కమిషన్ గుర్తించింది. వివరణాత్మక సమీక్ష తదుపరి ప్రభుత్వ మంత్రికి వర్తించే విధంగా ఈ సలహాదారులకు కూడా ఎన్నికల ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని ఈసీఐ స్పష్టంచేసింది. కమిషన్ యొక్క ఈ ఆదేశాలను ఏమాత్రం ఉల్లంఘిచినా తీవ్రంగా పరిగణిస్తూ సంబంధిత చట్టాలకు లోబడి కఠినమైన చర్యలను తీసుకోవడం కూడా జరుగుతుంది ఈసీఐ స్పష్టం చేసింది.

సలహాదారులందరిలోకి చీఫ్ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. మిగతా అందరికీ సలహాదారు పదవులు ఇప్పించేది కూడా ఆయనే. ఆయన చేస్తున్నదే రాజకీయం. వైసీపీ అభ్యర్థుల ప్రకటన దగ్గర్నుంచి వైసీపీ వ్యవహారాలన్నీ చక్క బెడుతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ.. బీజేపీని విమర్శిస్తున్నారు. చివరికి ప్రధాని మోదీ సభపైనా కామెంట్లు చేశారు. కానీ ఆయన కు ఏ రూల్స్ వర్తించడం లేదు. ఇతర సలహాదారుల గురించి చెప్పాల్సిన పని లేదు. వారు నేరుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.

ఇంత కాలం కోడ్ ఉల్లంఘించిన దానికి సజ్జలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు సజ్జల పార్టీ తరపున ప్రెస్ మీట్ పెట్టాలంటే రాజీనామా చేయాల్సి ఉంటుంది. చేస్తారా లేకపోతే.. ఈసీ తమకు బాగా తెలుసని సైలెంట్ గా ఉంటారో చూడాల్సిఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close