ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న వారి మధ్య ఈ చట్టంపై చర్చ జరుగుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో భూవివాదాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ చట్టం వస్తే ఎంత ప్రమాదకరంగా పరిస్థితి మారుతుందోనన్న చర్చ అన్ని వర్గాల రైతుల్లోనూ నడుస్తోంది.

ఈ చట్టాన్ని విశ్లేషించుకుంటే ఎవరైనా భయపడకుండా ఉండలేరు. నేరుగా హైకోర్టుకు వెళ్లేవరకూ ప్రభుత్వ అధికారుల దగ్గరే అప్పీల్ చేసుకోవాలి. అదే జరిగితే..ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. అందుకే ఈ చట్టంపై వైసీపీ సానుభూతిపరులు కూడా సంతృప్తికరంగా లేరు. ఇంకా ప్రధానమైన విషయం తమ ల్యాండ్ డాక్యుమెంట్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటూ ఉండటం. అది ప్రభుత్వ ల్యాండ్ కాదు. ప్రైవేటు ల్యాండ్. ప్రభుత్వం సర్వే చేసి పత్రాలిస్తుంది. అంత మాత్రం దానికే ఉంటుందో ఊడిపోతుందో తెలియని సీఎం ఫోటో వేసుకోవడం.. అది శాశ్వతంగా ఉంటుందని చెప్పడం చాలా మందిని అనుమానపరుస్తోంది. చట్టం ప్రకారం ప్రభుత్వ అధికార ముద్ర మాత్రమే ఉండాలి. కానీ జగన్ ఫోటోలు వేసుకుంటున్నారు.

ఇలా ప్రతీ ఒక్కటీ నిబంధనలకు విరుద్ధంగా సాగుతోంది. జగన్ రెడ్డి.. తన పోటో ప్రతి ఇంట్లో ఉండేలా చూసుకుంటానని ఎన్నికల ప్రచారంలో చెప్పేవారు. అందరూ ఆయన మంచిపనులు చేసి .. కృతజ్ఞతతో ఆయన ఫోటోపెట్టుకునేలా చేసుకుంటారని అనుకున్నారు. కానీ ఆయన తప్పనిసరి డాక్యుమెంట్ల మీద ఫోటోలు ముద్రదించుకుని ప్రతి ఇంట్లో తాను ఉంటానని చెప్పుకునేలా ఉన్నారు.ఇవన్నీ ప్రజల్లోకి విస్తృతంగా వెళ్తున్నాయి. వచ్చే పది రోజుల గ్రామ గ్రామాన చర్చా కార్యక్రమాలు పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తమిళిశైకి అమిత్ షా హెచ్చరిక

ఏపీ ప్రభుత్వం కొలువు దీరుతున్న వేదికపై బీజేపీ అంతర్గత రాజకీయాల వ్యవహారం హైలెట్ అయింది. తమిళనాడు మీడియాలో ఇది సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే... వేదికపై అమిత్ షా, వెంకయ్యనాయుడు మాట్లాడుకుంటూ ఉన్నారు....

మోదీ వస్తే అంతా సందడే !

చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ప్రధాని మోదీ అందర్నీ ఆకట్టుకున్నారు. మంత్రులెవరో తనకు పెద్దగా తెలియకపోయినా ఆప్యాయంగా మాట్లాడారు. కాస్త తెలిసిన వారయితే.. చిరు సంభాషణ జరిపారు. ఎవర్నీ పాదాభివందనం చేయనివ్వలేదు. ...

అధికారంలోకి రాగానే ఇచ్చిన మాటను నెరవేర్చిన చంద్రబాబు

ఇచ్చిన మాటను చంద్రబాబు అధికారంలోకి రాగానే నెరవేర్చారు. కష్టకాలంలో పార్టీ కోసం పని చేసిన వారికి రాబోయే ప్రభుత్వంలో గుర్తింపు ఉంటుందన్న చంద్రబాబు, అలాంటి నేపథ్యమున్న నేతలకు కూటమి సర్కార్ లో ప్రాధాన్యత...

ఏపీ భ‌విష్య‌త్తుపై భ‌రోసా క‌నిపిస్తోంది: చిరంజీవి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త ప్ర‌భుత్వం కొలువు తీరింది. ముఖ్య‌మంత్రిగా చంద్రబాబు నాయుడుతో పాటు కొత్త మంత్రులు ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి చిరంజీవి అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మాణ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close