‘అమరావతి’ ఊహాచిత్రాల విడుదల: పనుల ప్రారంభం 2017లోనే

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిర్మించబోయే రాజధాని ‘అమరావతి’ నగర ఊహాచిత్రాలు ఏపీ ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. ఆకాశ హర్మ్యాలు, విశాలమైన రహదారులు, ఆకాశమార్గంలో దూసుకుపోయే మెట్రో రైల్ మొదలైనవి ఈ చిత్రాలలో కనిపిస్తున్నాయి. ఈ చిత్రాలనుబట్టి చూస్తే అమరావతి ప్రపంచంలోని అత్యాధునిక నగరాలను తలదన్నేలా ఉంటుందనిపిస్తోంది.

మరోవైపు అమరావతి ఎలా వుండాలో మాస్టర్ ప్లాన్ సిద్ధమైంది. 20వ తేదీన సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ తన బృందంతో రాజమండ్రి లో సీడ్‌ మాస్టర్‌ప్లాన్‌ డిజైన్‌ను చంద్రబాబుకు అందిస్తారు. ప్లాన్ రూపొందించడానికి సింగపూర్ సంస్ధలకు ఏడాది పట్టింది. ఈ ప్లాన్ ఆధారంగా నిర్మాణాలు జరగాలి. నిర్మాణాల డిజైన్లు రూపొందించి, నిర్మాణవ్యయం తోసహా ముందుకి వచ్చేవారికోసం ప్రపంచవ్యాప్తంగా టెండర్లు పిలుస్తారు. ఆందులో ఎంపిక చేసిన డిజైన్లపై రేటు విషయంలో మళ్ళీ టెండర్లు పిలుస్తారు. స్విస్ ఛాలెంజింగ్ అనే ఈ టెండరింగ్ విధానం ద్వారా తక్కువ ఖర్చుతో నాణ్యమైన ప్రపంచ స్ధాయి నిర్మాణాలు జరిపించాలన్నది తన ఆలోచన అని ముఖ్యమంత్రి ఒక ప్రిపరేటరీ మీటింగ్ చెప్పారు. సింగపూర్ ప్రతినిధుల వసతిసౌకర్యాల గురించి వారికి పుష్కరశోభను చూపించే ప్రదేశాల గురించి ఈ సమావేశంలో అధికారులకు బాధ్యతలు కేటాయించారు.

మాస్టర్ ప్లాన్ రూపొందించిన సింగపూర్ సంస్ధలు వారు నిర్మాణాలకు కూడా టెండర్లువేస్తారు. అయితే జపాన్, చైనా దేశాల వర్క్ కల్చర్, క్వాలిటీ ఆధునికత బాగుంటాయని ముఖ్యమంత్రి భావిస్తున్నారని అధికారవర్గాల ద్వారా తెలిసింది. ఆదేశాల సంస్ధలు అమరావతి నిర్మాణంలో పాల్గొనే వాతావరణాన్ని కల్పించడమే ముఖ్యమంత్రి పర్యటనల్లో ఒకప్రయోజనమని అర్ధమౌతోంది.

అయితే స్విస్ ఛాలెంజ్ పద్దతిలో తుది టెండర్లు ఏడాది లో ఖరారయితే తొందరగా పని అయినట్టేనంటున్నారు. ఈ నేపధ్యంలో అమరావతి నిర్మాణం 2016 లో మొదలయ్యే అవకాశాలు చాలా తక్కువే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close