కాంగ్రెస్ పాపాలను కడిగేస్తాం: హరీష్ రావు

తెలంగాణా శాసనసభలో బడ్జెట్ పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత కె.జానారెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకి మధ్య ప్రాజెక్టులపై వాదోపవాదాలు జరిగాయి. మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ “కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొన్నప్పుడు, పదేళ్ళు రాష్ట్రాన్ని పాలించినా ఆ ఒప్పందంలోని ఒక్క ప్రాజెక్టుని కూడా ఎందుకు పూర్తి చేయలేకపోయాయి? కాంగ్రెస్ నేతలు తమ జేబులు నింపుకోవడానికే పనికిరాని దేవాదుల ప్రాజెక్టుని నిర్మించారు. ప్రాణహిత ప్రాజెక్టు కోసం 2007లోనే టెండర్లు పిలిచినా 2014 వరకు పనులే మొదలుపెట్టలేదు కానీ దాని పేరు చెప్పుకొని కాంగ్రెస్ పార్టీ నేతలు ఏకంగా రూ.1400 కోట్లు జేబులో వేసుకొన్నారు. పనులు జరుగకపోయినా మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట కోట్లాది రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో పోసి, పనిలోపనిగా కాంగ్రెస్ పార్టీ నేతలు తమ జేబులు కూడా నింపుకొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్ని పాపాలను మా ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి కడిగివేస్తుంది. వచ్చే ఎన్నికలలోగా రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీళ్ళు అందించాలనే గొప్ప సంకల్పంతో మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది,” అని హరీష్ రావు చెప్పారు.

దానికి జానారెడ్డి కూడా చాలా దీటుగానే జవాబు చెప్పారు. “ఆనాడు మా ప్రభుత్వం మొదలుపెట్టిన అనేక ప్రాజెక్టులు దాదాపు పూర్తయ్యాయి కనుకనే నేడు మీరు వాటి ఫలాలు అనుభవించగలుగుతున్నారు. ఆనాడు నేను ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పోరాదినందునే ఏ.ఎం.ఆర్. ప్రాజెక్టు వచ్చింది. దాని ద్వారా నల్గొండ జిల్లాలో అనేక వేల ఎకరాలు సాగావుతున్నాయి. మా ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన అనేక విద్యుత్ ప్రాజెక్టులు నేటికి నిర్మాణం పూర్తి చేసుకొని విద్యుత్ ఉత్పత్తి మొదలుపెట్టాయి కనుకనే నేడు విధ్యుత్ సంక్షోభం నుండి రాష్ట్రం బయటపడగలిగింది. రాష్ట్రం కోసం అన్నీ మేమే చేస్తున్నాము మరెవరూ ఏమీ చేయలేధన్నట్లు తెరాస నేతలు మాట్లాడటం అవివేకమనిపించుకొంటుంది,” అని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close