విశాఖలో ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుని ప్రారంభించిన చంద్రబాబు

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో ఎప్పుడూ అందరి కంటే ముందుండే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఐదు గ్రిడ్స్ లో ఒకటయిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టుకి ఈరోజు విశాఖలో ప్రారంభోత్సవం చేసారు. ఈ ప్రాజెక్టు ద్వారా కేవలం నెలకి రూ.150లకే ఇంటింటికీ టెలీఫోన్ సౌకర్యం, 15ఎం.బి.పి.ఎస్. వేగం కలిగిన ఇంటర్నెట్ కనెక్షన్ మరియు టీవీ ఛానల్స్ అందించబోతున్నారు. విశాఖలో ఆంధ్రా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రంలో గల ఒక భవనంలో తాత్కాలికంగా దీని కోసం ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేసారు.

ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే విశాఖ, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాలలో సుమారు 2661 కిమీ పొడవునా ఆప్టికల్ ఫబార్ కేబుళ్ళను వేశారు. వాటిని గృహాలకి అనుసంధానం చేసి ఈ మోఉ సౌకర్యాలు కల్పించబోతున్నారు. మారుమూల గ్రామలను సైతం ఇంటర్నెట్, ఫోన్ ల ద్వారా ప్రపంచంతో అనుసంధానం చేయాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టుని చేపట్టారు. తద్వారా మారుమూల గ్రామాలకు టెలి మెడిసిన్, దూర విద్య, రైతులకు వ్యవసాయ సూచనలు, తదితర సౌకర్యాలు కల్పించవచ్చును. టెలి, వీడియో కాన్ఫరెన్స్ విధానాలలో రాష్ట్ర ప్రభుత్వం మరియు వివిధ స్వచ్చంద సంస్థలు మారుమూల గ్రామాల ప్రజలతో సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించే అవకాశం కలుగుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close