తెలంగాణా రాజకీయ ఐ.కా.స.కి కాంగ్రెస్ పార్టీ అండ!

తెలంగాణా ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించిన తెలంగాణా రాజకీయ ఐ.కా.స. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత నుంచి క్రమంగా తన ఉనికిని కోల్పోతోంది. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం చేసిన పోరాటాలలో దానిని ఉపయోగించుకొన్న తెరాస అధ్యక్షుడు కేసీఆర్, అధికారంలోకి వచ్చిన తరువాత దానిని పట్టించుకోకపోవ, దానిలో ఉద్యోగ సంఘాల నేతలు ఒకరొకరుగా తెరాస పార్టీలో చేరిపోయిన కారణాలుగానే ఐ.కా.స. కూడా ప్రతిపక్ష పార్టీల మాదిరిగానే క్రమంగా నిర్వీర్యమయిపోసాగింది. తెలంగాణా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ఐ.కా.స.లో కొనసాగినట్లయితే తమకూ ప్రభుత్వం నుండి ఇబ్బందులు తప్పవనే భయంతో మరికొందరు దానిలోంచి బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ పరిస్థితులలో ఇంకా దానిని కొనసాగిస్తారా లేదా అనే సందేహం తలెత్తుతోంది.

రాజకీయ ఐ.కా.స. చైర్మన్ ప్రొఫెస్సర్ కొదండరాం మొన్న మీడియాతో మాట్లాడుతూ, “దీనిని తెలంగాణా సాధన కోసమే ఏర్పాటు చేసినప్పటికీ, హైకోర్టు విభజన వంటి కొన్ని లక్ష్యాలు ఇంకా కొన్ని మిగిలిపోయాయి కనుక ఎన్ని అవాంతరాలు ఎదురయినా దీనిని కొనసాగిస్తాము,” అని చెప్పారు.

తెలంగాణా సాధన కోసం పోరాడిన ఈ రాజకీయ ఐ.కా.స.ను తెరాస ప్రభుత్వం పట్టించుకోకపోయినప్పటికీ, దానికి తాము అండగా నిలుస్తామని కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష ఉపనేత జీవన్ రెడ్డి ప్రకటించారు. “ఉద్యోగులు, సాగునీటి పంపకాల సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. ఉమ్మడి హైకోర్టు విభజన ఇంకా జరుగలేదు. ఇవి కాక తెరాస ప్రభుత్వం ప్రకటించిన అనేక హామీలు అమలు కావలసి ఉంది. కనుక ఇటువంటి కీలక సమయంలో రాజకీయ ఐ.కా.స. తన బాధ్యతల నుంచి తప్పుకోవడం సమజంసం కాదు. దానికి మా పార్టీ పూర్తి సహాయసహకారాలు అందిస్తుంది,” అని జీవన్ రెడ్డి చెప్పారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీఆర్ఎస్ కూ ఓ వ్యూహకర్త అవసరమే..!!

ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను ఎంపిక చేసుకొని తర్వాత వదిలేసుకున్న బీఆర్ఎస్ కు ఆ అవసరం ఏపాటిదో క్రమంగా అర్థం అవుతోంది. వ్యుహకర్తగా అపాయింట్ చేసుకున్న సునీల్ కనుగోలు వ్యూహాలతో కాంగ్రెస్...

రేవంత్ ను కలిసిన రోహిత్ వేముల తల్లి..కేసు రీఓపెన్ కు హామీ

హెచ్ సీ యూ విద్యార్ధి రోహిత్ వేముల ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని, ఈ కేసును ఇంతటితో మూసివేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించడంతో తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు రోహిత్...

అనంత శ్రీ‌రామ్ పై బాల‌య్య ఫ్యాన్స్ ఫైర్‌

టాలీవుడ్ లో పేరున్న గీత ర‌చ‌యిత‌... అనంత శ్రీ‌రామ్‌. ఇప్పుడు ఈయ‌న‌కు కూడా రాజ‌కీయం బాగానే వంటబ‌ట్టింద‌నిపిస్తోంది. అప్పుడ‌ప్పుడూ కొన్ని పొలిటిక‌ల్ సెటైర్ల‌తో క‌వ్వించ‌డం అనంత శ్రీ‌రామ్‌కు అల‌వాటే. తాజాగా ఆయ‌న చేసిన...

య‌శ్ స‌ర‌స‌న న‌య‌న‌తార‌

'కేజీఎఫ్`తో య‌శ్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. 'కేజీఎఫ్‌' త‌ర‌వాత య‌శ్ ఎలాంటి సినిమా చేయ‌బోతున్నాడా? అని దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఈ నేప‌థ్యంలో గీతు మోహ‌న్ దాస్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించ‌డానికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close