జూన్ నుంచి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ మొదలు

హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులను అమరావతి తరలించే విషయంపై శుక్రవారం ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులు సమావేశమయ్యారు.

వారి చర్చలో అంగీకరించిన విషయాలు:
· 15-20 శాతం మంది ఉద్యోగులు మరొక ఏడాది వరకు హైదరాబాద్ లోనే పనిచేస్తారు.
· జూన్ నెలలో 6,000 మంది, జూలైలో 3,000 మంది, ఆగస్టులో 3,000 మంది ఉద్యోగులను అమరావతికి తరలిస్తారు.
· ప్రస్తుతం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంపైనే మరో రెండు అంతస్తులు నిర్మించి, అందులోనే వివిధ కమీషనరేట్స్, డైరెక్టరేట్స్ ను ఏర్పాటు చేస్తారు.
· తాత్కాలిక సచివాలయం సమీపంలోనే ఉద్యోగులు అందరికీ బ్యాచిలర్ ఎకామిడేషన్, ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది.
· వారానికి ఐదు రోజుల పని విధానం అమలుచేయబడుతుంది.
· ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలు విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో ఏర్పాటు చేస్తారు.

వీటిలో చాలా వాటికి ఇరు పక్షాలు దాదాపు అంగీకరించాయి. వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఆయన చేత ఆమోదముద్ర వేయించుకోవడమే మిగిలుందని భావించవచ్చును. ఇవి కాక ఉద్యోగులు మరికొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు.

· హైదరాబాద్ లో మాదిరిగానే సీసీఏ, 30 శాతం ఇంటి అద్దె భత్యం చెల్లించాలి.
· ఉద్యోగుల కుటుంబాల తరలింపు కోసం ఒక నెల జీతం లేదా మూల వేతనం చెల్లించాలి.
· ఇంటి సామాను తరలింపుకి ఎంత ఖర్చయితే అంతా ప్రభుత్వమే భరించాలి.
· ఉద్యోగుల పిల్లలకి వారు కోరుకొన్న కళాశాలలోనే విద్యాశాఖ అడ్మిషన్స్ ఇప్పించాలి.
· వారానికి ఒకసారి హైదరాబాద్ వెళ్లి వచ్చేందుకు ఏడాదిపాటు ఆర్టీసీ బస్సు టికెట్స్ పై రాయితీ, స్వంత వాహనాలలో వెళ్ళేవారికి టోల్ టాక్స్ మినహాయింపునివ్వాలి.
ఈ డిమాండ్లపై ముఖ్యమంత్రితో చర్చించి వారం రోజులలోగా తమ నిర్ణయం తెలియజేస్తామని మంత్రి నారాయణ ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. తాత్కాలిక సచివాలయాన్ని నిర్మిస్తున్న ఎల్ అండ్ టి మరియు షాపూర్ జీ పల్లోంజీ సంస్థలతో మరో రెండు అంతస్తుల నిర్మాణానికి తక్షణమే ఒప్పందం చేసుకొంటామని మంత్రి నారాయణ చెప్పారు. ఆ రెండు సంస్థలతో ఇంతకు ముందే ఈ విషయం మాట్లాడామని అందుకు వారూ సంసిద్దత వ్యక్తం చేసినట్లు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close